వెంకటేష్ షాడో టీజర్ కు మంచి స్పందన వస్తోంది. షూటింగ్ మొత్తం అయిపోయిందని ఈ మధ్యనే ప్రచారం జరిగింది. కానీ మలేషియాలో 17 రోజుల షెడ్యూల్ మిగిలుందని దర్శకుడు మెహర్ రమేష్ అంటున్నారు. వెంకటేష్ తో పాటు శ్రీకాంత్, తాప్సీ, మధురిమ కూడా మలేషియా వెళ్తారట. ఇంతమంది మళ్ళీ మలేషియాకు ఎందుకు? వెళ్తున్నారు అన్నది పలువురిని వేధిస్తున్న ప్రశ్న. సినిమా షూటింగ్ అయిపోయినప్పటికీ కొన్ని సన్నివేశాలు రీ షూట్ చేయడం కోసం వెళ్తున్నారన్నది గుట్టుచప్పుడు కాని మాట. ఈ నెల 8 నుంచి 27 వరకు షూటింగ్ జరగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: