కేన్స్ చిత్రోత్సవంలో.. ఎర్ర తివాచీ పై హొయలొలికిస్తూ నడిచిన అందాల ఐశ్వర్యం.. ఎందరికో నిద్రలేని రాత్రులు మిగిల్చింది. అమ్మ అయ్యాక ఐశ్వర్య అందం తగ్గిపోయిందని అంతా అనుకున్నారు. ఆ మధ్య మీడియాలో వచ్చిన ఆమె ఫోటోలు కూడా ఆ సంగతే తేల్చి చెప్పాయి. కూతురు ఆరాధ్యను ఎత్తుకుని.. కాస్త ముద్దుగా బొద్దుగా తయారైన ఐశ్వర్యను చూసి.. ఎంత అందగత్తె అయినా ప్రకృతి సహజత్వానికి అతీతం కాదు కాదా.. అని నిట్టూర్చి.. పాత ఐష్ ను గుర్తుతెచ్చుకుని సంతృప్తి పడ్డారు. అలాంటిది.. ఒక్కసారిగా కేన్స్ ఎర్ర తివాచీపై నడిచివచ్చిన సౌందర్యదేవతలా ఐశ్వర్య దర్శనమిచ్చేసరికి కళ్లప్పగించి చూడటం అందరి వంతైంది. మళ్లీ తొలినాటి అందాల ఐష్ ను మరిపించేలా కవ్విస్తూ నడిచి వచ్చిన ఈ శ్రీమతి బచ్చన్ ను చూసి సౌందర్య ప్రియులు, అభిమానులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. అదీ ఐష్ స్పెషాలిటి అని మనసులోనే ప్రశంసల వర్షం కురిపించారు. మీడియా కూడా వీలైనంత ఎక్కవగా ఐశ్వర్య అందాలను ప్రసారం చేసింది. అంతా బాగానే ఉన్నా.. ఈ అందాల ప్రదర్శన ఒక్క వ్యక్తికి మాత్రం నిద్రలేని రాత్రులను ప్రసాదించింది. ఆయనే ఐశ్వర్య భర్త జూనియర్ బచ్చన్.. ఐష్ అందాల ప్రదర్శన చూసి అవాక్కైన భర్తగారు... సరికొత్త ఐష్ ను కళ్లప్పగించి చూశానని తానే స్వయంగా ట్వీట్ చేశారు. అంతేకాదు.. ఐష్ సరికొత్త రూపాన్ని చూసి.. 52గంటలపాటు నిద్రకు దూరమయ్యాయని స్వయంగా ప్రకటించుకున్నారు. ఎంతైనా తనకే సొంతమనుకున్న అందం.. ప్రపంచానికంతటికీ ఆరాధ్యమైతే.. భరించడం కష్టమే కదా..

మరింత సమాచారం తెలుసుకోండి: