యాంగ్రీ యంగ్ మేన్ పాత్రలు పోషించే యంగ్ హీరో గోపీచంద్ హీరో ప్రభాస్ సోదరుడు నిర్మాతగా రాధాకృష్ణ కుమార్ అనే నూతన దర్శకుడుతో ఒక సినిమాను మొన్న ప్రారంభించగానే గోపీచంద్ బిగోపాల్ కాంబినేషన్ లో గత సంవత్సరం ప్రారంభం అయిన సినిమా పరిస్థితి ఏమిటి అంటు ఫిలింనగర్ లో గుసగుసలు మొదలయ్యాయి. ఈ సినిమా గురించి ప్రస్తుతం గోపీచంద్ ఏమి మాట్లాడకుండా ఉండటంతో ఈసినిమా ఆగిపోయినట్లే అంటున్నారు. మరి ఆ నిర్మాతల పరిస్ధితి ఏమిటని వార్తలు రావడమే కాకుండా గోపీచంద్ ని నమ్ముకుని రెండు సార్లు డైరక్టర్ ని మార్చినా సినిమా ఫినిష్ చేయలేకపోవడంతో ఇప్పుడా నిర్మాతల గురించే అంతటా చర్చ జరుగుతోంది.  ఫైనాన్స్ సమస్యలతో ఆగినట్లు చెప్తున్నా గోపీచంద్ సరిగ్గా నిర్మాతకు సహకరించకపోవడం వల్లే ఈ సినిమా ఆగిపోయింది అని అంటున్నారు. నయనతార హీరోయిన్ గా భారీ బడ్జెట్ తో రెండు పాటలతో సహా దాదాపు 60 శాతం చిత్రీకరణ పూర్తయైన ఈ చిత్రం ఆగిపోవటం అంటే నిర్మాతను నిట్టనిలవునా ముంచేసినట్లే అని కామెంట్స్ చేస్తున్నారు. ఆ నిర్మాతకు న్యాయం చేయటానికి గోపిచంద్ ఏం నిర్ణయం తీసుకుంటాడు అనే విషయం పై అంతా ఆ శక్తి నెలకొని ఉంది. 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు', 'ఇంద్ర' లాంటి చిత్రాల్ని రూపొందించిన బి.గోపాల్‌ కు ఈ సినిమా ఆగిపోవటం అనేది ప్రస్టేజ్ సమస్యే. ఈ పరిస్థుతులలో ఇప్పటికే అంత సజావుగా లేని తన కెరియర్ ను దృష్టిలో పెట్టుకుని గోపీచంద్ ఈ సినిమా విషయంలో సమయస్పూర్తితో వ్యవహరిస్తాడు అని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: