కోలీవుడ్ హీరోయిన్స్ లో ఎందరు బ్యూటీలున్నా నయనతారకు ఎదురులేదు. ఆమె డేట్స్ ఇస్తే చాలు ఆమె ముందు కోట్లు పెట్టడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు. మూడు పదుల వయస్సు దాటి పోతున్నా నయన్ క్రేజ్ కు ఎదురులేకుండా ఉంది. ఇన్నాళ్లకు నయనతార సొంత గొంతుని వినే అదృష్టం కోలీవుడ్ ప్రేక్షకులకు కలగబోతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ పదేళ్లలో ఎన్నో సినిమాలు చేసిన నయనకు ఇంతవరకూ ఎవరెవరో డబ్బింగ్ చెప్పారు. తెలుగులో వచ్చిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’లో మాత్రం తొలిసారిగా డబ్బింగ్ చెప్పుకుంది నయన. అయితే ఆమె డబ్బింగ్‌కి మంచి మార్కులే పడ్డాయి అయితే ఇప్పటివరకు తమిళ ప్రేక్షకులకు మాత్రం నయనతార గొంతు వినే భాగ్యం కలగలేదు.  ఈ ఏడాది అక్కడి ప్రేక్షకులకు కూడా తన మధురమైన కంఠస్వరాన్ని వినిపించాలని నయనతార నిర్ణయించుకుంది. ఆమె మాజీ ప్రియుడు శింబు సరసన నయనతార ‘ఇదు నమ్మ ఆళు’ అనే చిత్రంలో నటిస్తోంది. దాదాపు ఏడేళ్ల విరామం తరువాత ఈ మాజీ ప్రేమికుల జంట నటిస్తున్న సినిమా కావడంతో ఈసినిమా విషయంలో ఇప్పటికే మంచి క్రేజ్ ఏర్పడింది.  ఈ క్రేజ్ ను మరింత పెంచాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా దర్శక నిర్మాతలు నయన సొంత గోతుకతో ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పిద్దామనుకుంటే అప్పటిదాకా ఆమె ఈ సినిమాకు పారితోషికంగా తీసుకున్న కోటిన్నరను ఏకంగా రెండు కోట్లుగా పెంచి నిర్మాత నుండి ముక్కు పిండి వసూలు చేసిందట. దీనితో షాక్ అయిన ఈ సినిమా నిర్మాత నయన గొంతు విలువ 50 లక్షల రూపాయలా అని బుర్ర పీక్కుంటున్నాడట.  

మరింత సమాచారం తెలుసుకోండి: