పవన్ ‘అత్తారిల్లు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు గ్లామర్ అత్తగా మారిన నదియా క్రేజ్ ఆకాశాన్ని తాకడంతో ఆమె పారితోషికాన్ని కూడ అందనంతగా పెంచేసింది. దీనితో ఈమెతో సినిమాలు చేద్దామని చాలామంది దర్శక నిర్మాతలు భావిస్తున్నా నదియా అడిగే పారితోషికాన్ని విని భయపడిపోతున్నారు. ఈ నేపధ్యంలో నడియాకు ఒకనాటి మణిరత్నం ‘రోజా’ హీరోయిన్ మధుబాల, నదియాకు ఇచ్చిన షాక్ సంచలనంగా మారింది. ఇక వివరాలలోకి వెళితే గత సంవత్సరం టాలీవుడ్‌లో రికార్డులు తిరగరాసిన 'అత్తారింటికి దారేది' ప్రస్తుతం కన్నడలో రీమేక్ అవుతోంది. 'ఈగ' ఫేమ్, కన్నడ సూపర్ స్టార్ సుదీప్ హీరోగా ఈ సినిమా రీమేక్ కానుంది. సుదీప్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీలో ముందుగా అత్త పాత్రకు నదియాను అనుకున్నా ఆమె పారితోషికం విని భయపడ్డ సుదీప్ మధుబాలను ఈ సినిమాకు అత్తగా మార్చి నడియాకు గట్టి షాక్ ఇచ్చాడని శాండల్‌వుడ్ టాక్. ప్రస్తుతం సుదీప్ తెలుగు సినిమాలపై కన్నేశాడు.  తెలుగులో హిట్ అయిన సినిమాల్ని కన్నడలో రీమేక్ చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే ప్రభాస్ 'మిర్చి'ని 'మాణిక్య' పేరుతో రీమేక్ చేసిన సినిమాలో హీరోగా సుదీప్ నటించి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు 'అత్తారింటికి' రీమేక్‌కి రెడీ అవుతున్నాడు. 16 ఏళ్ల విరామం తరువాత గతసంవత్సరం 'అంతకుముందు ఆతరువాత' సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన మధుబాల నదియాకు అనుకోని గట్టి షాక్ ఇచ్చింది అని అనుకోవాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: