రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమాకు సంబంధించి మరొక ఆశక్తికర వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను నిర్మిస్తున్న రాఘవేంద్రరావు అల్లుడు శోభు యార్ల గడ్డ వెనుక ఈ సినిమాకు సంబంధించి గాడ్ ఫాదర్ గా ప్రముఖ పత్రికా అధినేత రామోజీరావు పేరు వినపడటం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఎపి హెరాల్డ్ కు అందుతున్న సమాచారం ప్రకారం భారతీయ సినిమా చరిత్రలోనే కనీవినీ ఎరుగని భారీ బడ్జెట్ 175 కోట్ల వ్యయంతో తెరకెక్కుతున్న ‘బాహుబలి’ సినిమా భారీ పెట్టుబడి వెనుక రామోజీ ఫిల్మ్ సిటీ అధినేత రామోజీరావు సహాయ సహకారాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా ప్రస్తుతం హడావిడి చేస్తున్న ఈ న్యూస్ ఫిలింనగర్ లో సంచలనంగా మారింది. ఒక వైపు పెరిగి పోతున్న ఈ సినిమా బడ్జెట్ అందర్నీ ఆశ్చర్య పరుస్తుంటే మరొక వైపు ఈ సినిమా బిజినెస్ పై వస్తున్న వార్తలు కూడా అందరికి షాకింగ్ గా ఉన్నాయి. ఈ సినిమాను దిల్ రాజ్ కనీవినీ ఎరుగని రీతిలో 25 కోట్లకు నైజాం ఏరియాకు తీసుకున్నాడు అనే వార్తలతో ‘బాహుబలి’ బిజినెస్ భవిష్యత్ లో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో అనే ఊహలను ఫిలింనగర్ పoడితులకు కలుగ చేస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: