ఇళయరాజా వారసుడిగా యువన్ శంకర్ రాజా మంచి పేరు తెచుకున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాలకు మంచి హిట్ సాంగ్స్ అందించిన యువన్ టాలీవుడ్ సినిమాలు వచ్చేసరికి తెలుగు ప్రేక్షకులు మెచ్చే పాటలు అందించ లేకపోతున్నాడు. గతంలో మెగా హీరోలు నటించిన ‘హ్యాపీ’, ‘పంజా’ సినిమాలకు యువన్ అందించిన సంగీతం కలిసి రాని సెంటిమెంట్ ఉంది. చాల సంవత్సరాల క్రితం విడుదలైన ‘ఆడవారి మాటలకు అర్థాలు వేరులే’ సినిమాలోని ఆడియో తప్ప మరే సినిమా ఆడియో యువన్ కు కలిసి రాలేదు. ఈ పరిస్థుతులలో ఇటువంటి ఫ్లాప్ ట్రాక్ రికార్డు ఉన్న యువన్ తమ అభిమాన హీరో చరణ్ నటిస్తున్న ‘గోవిందుడు అందరివాడేలే’ ఆడియోను తన ప్రయోగాలతో ఏమైనా పాడుచేసాడా అని చరణ్ అభిమానులు నేడు సాయంత్రం విడుదల కాబోతున్న ‘గోవిందుడు అందరివాడేలే’ పాటల గురించి తీవ్రంగా భయ పడుతున్నారు అనే వార్తలు వినపడుతున్నాయి.  కృష్ణవంశీ సినిమాలలో పాటలకు విపరీతమైన ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి యువన్ అందించే స్వరాలలో ఏమైనా తెడా వస్తే అది ‘గోవిందుడు’ సక్సస్ పై తీవ్ర ప్రభావం చూపెడుతుందని చరణ్ అభిమానుల వాదన. ఈరోజు సాయంత్రం జరగబోతున్న ‘గోవిందుడు’ ఆడియో వేడుకకు నిర్మాత బండ్ల గణేష్ భారీ ఏర్పాట్లు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. మెగా అభిమానులు ఎవరూ ఇబ్బంది పడకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్మాత బండ్ల గణేష్ మీడియాకు తెలిపారు. అయితే సాయంత్రం జరగబోయే ఆడియో వేడుకలో యువన్ శంకర్ రాజా సెంటిమెంట్ ‘గోవిందుడు’ ను చెడగొట్టకుండా ఉండాలని మెగా అభిమానులు పూజలు చేస్తున్నట్లు టాక్.  

మరింత సమాచారం తెలుసుకోండి: