స్విట్జర్లాండ్ దేశం లోని జ్యూరిచ్‌ ఎయిర్ పోర్ట్ లో తేనె కళ్ళ సుందరి శృతి హాసన్ కు అవమానం జరిగిందట . ఈ విషయం స్వయంగా శృతి తెలియచేసింది. సామాన్యంగా మన హీరోయిన్స్ ను తమ అందం గురించి పొగుడుతూ ఉంటే మురిసిపోతూ ఉంటారు. కాని తన గ్లామర్ తో టాలీవుడ్ ను అదర గోడుతున్న శృతి హసన్ ను చూసి జ్యూరిచ్‌ ఎయిర్ పోర్ట్ లో ఒక వ్యక్తి శృతి వంక చూస్తూ ఇదేమిటి ఈమె జాంబిలా ఉన్నది అంటూ కామెంట్ చేయడం ఆ ఎయిర్ పోర్ట్ లో నడిచి వెళుతున్న శృతి చెవిన పడిందట. స్విడ్జర్లాండ్ లో ప్రజలు తమకు ఎవరైనా విచిత్రం గా కనిపిస్తే వెంటనే జాంబి లా ఉంది ఏమిటి అని కామెంట్ చేస్తారట.  ఇండోనేషియాలోని సుమత్రా దీవులలో ఈ విచిత్ర మైన తెగ ఉంటుంది. అటువంటి భయం కరమైన పోలికతో శృతిని ఆ జ్యూరిచ్‌ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికుడు పోల్చే సరికి షాక్ అయిన శృతి తన హోటల్ లోని తన రూమ్ లో విశ్రాంతి తీసుకుంటూ ఆ మాటలు గుర్తుకు వచ్చి అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటే సరి అయిన నిద్ర లేక వాడిపోయిన తన ముఖం తనకు కనిపించి ఆ ప్రయాణికుడు వేసిన జోక్ నిజమేనా అని అనిపించేడట్లు తన ముఖం కనిపించడం తనకే భయం వేసిందని శృతి ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో చెప్పింది. ఇటీవల ఓ సినిమాషూటింగ్ కోసం జ్యూరిచ్‌ వెళ్లి నప్పుడు ఈ విచిత్ర సంఘటన శృతికి ఎదురు అయ్యిందట. శృతి క్రేజ్ తో ఇక్కడి యూత్ నలిగి పోతూ ఉంటే స్విడ్జర్లాండ్ ప్రజలకు శృతి మరో రకంగా కనిపించడం శ్రుతికి నిజంగానే షాకింగ్ అనుకోవాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: