నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ నటిస్తున్న 'ముకుందా' సినిమాపై చాలా అంచనాలు వున్నాయి. మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, ఆరడుగుల అందగాడు నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ పై టాలీవుడ్ లో భారీ అంచనాలే నెలకొన్నాడు. ఈ మూవీకి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ 'ముకుందా' సినిమాపై క్రేజ్ అంతకంతకు పెరిగిపోతోంది. సినిమా కోసం మెగా అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మెగా హీరో ఎంట్రి ఎలా ఉండబోతుందో అంటూ ఇప్పటికే మెగా ఫ్యాన్స్ తెగ ఆసక్తిని కనబరుస్తున్నారు. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న మొదటి సినిమా ‘ముకుంద’. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. వరుణ్ తేజ్ కూడా ప్రస్తుతం తన పార్ట్ కి సంబందించిన డబ్బింగ్ చెబుతున్నాడు. ఇదిలా ఉంటే ఈ చిత్ర టీం ‘ముకుంద’ ఆడియోని నవంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే అధికారిక రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు. ముకుంద ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ లుక్ టీజర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ మూవీ ఆడియో ఫంకక్షన్ కి మెగా హీరోలు అందరూ ఒకే వేధికపైకి వచ్చే అవకాశం ఉందని చిత్ర వర్గాల నుండి టాక్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే ముకుంద ఆడియో ఫంక్షన్ కి చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లుఅర్జున్ హాజరవుతున్నట్టుగా ఆడియో ఫంక్షన్ ఆర్గనైజర్స్ దగ్గర లిస్ట్ ఉన్నట్టుగా టాలీవుడ్ లో టాక్స్ నడుస్తున్నాయి. ఈ మూవీలోవరుణ్ తేజ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: