ఇండియన్ క్రికెట్ డైనమేట్ ఎమ్.ఎస్. ధోనీ జీవితంపై ఒక సినిమా తీసుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సగభాగం చిత్రీకరణ పూర్తి అయిపోయిన ఈ సినిమాను నిర్మించడానికి ధోనీ అంగీకారం తీసుకోవడం కోసమే క్రికెటర్ ధోనీకి 20 కోట్లు పారితోషికంగా ఈ సినిమా నిర్మాతలు ఇచ్చినట్లుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.  ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఇండియన్ క్రికెట్ టీమ్ కు కెప్టెన్ గా ఎదగడమే కాకుండా భారతదేశం గర్వింప తగ్గ ఎన్నో విజయాలను అందుకున్న ధోనీ జీవితంలో అనేక ఆ శక్తి కర విషయాలు ఉన్నాయి. ఈ విషయాలన్నిటినీ ఒక సినిమాగా రూపొందించడం ఒక సంచలనం అయితే ఇంకా నిర్మాణం పూర్తి కాని ఈసినిమాను ఫాక్స్ స్టార్ స్టూడియోస్ 80 కోట్లకు కొన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.  ఎ వెడ్నస్ డే, స్పెషల్ చబ్బీస్ లాంటి వైవిధ్య భరితమైన సినిమాలను నీరజ్ పాండే ఈ సినిమాను తీస్తున్నాడు. ధోనీ చిన్నతనం నుండి జరిగిన సంఘటనలతో పాటు ధోనీకి ఆప్తులైన ఎంతో మంది సన్ని హితుల దగ్గర నుంచి వివరాలు సేకరించి ఈ సినిమాను చాల కష్టపడి రూపొందిస్తున్నాడు నీరజ్ పాండే. శుద్ద్ దేశీ రొమాన్స్ సినిమాతో హీరోగా పరిచయం అయిన సుశాంత్ రాజ్ పుత్ ఈసినిమాలో ధోనీ పాత్రలో నటిస్తున్నాడు. సినిమాలో నటించకుండానే తన సినిమాకు సంబంధించి 20 కోట్లు పారితోషికంగా తీసుకోవడం ధోనీ విషయంలో మరొక సంచలన వార్తగా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి: