శ్రీనువైట్ల కి మహేష్ బాబు షాక్ ఇచ్చాడంటూ టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే కమర్షియల్ డైరెక్టర్ శ్రీనువైట్ల, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన మూవీ దూకుడు. దూకుడు మూవీ టాలీవుడ్ బాక్సాపీస్ ని షేక్ చేయటమే కాకుండా సరికొత్త రికార్డ్స్ ని సైతం క్రియేట్ చేసింది. తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో మరో వచ్చిన మరో మూవీ ఆగడు. దూకుడు ఎంతటి బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఇచ్చిందో, దానికి పూర్తి వ్యతిరేకంగా ఆగడు మూవీ ఘోరంగా డిజాస్టర్ అయింది. దీంతో శ్రీనువైట్ల, మహేష్ బాబుల మధ్య సంబంధాలు మంచిగా లేవంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. తాజాగా శ్రీనువైట్ల ఓ మంచి స్టోరి లైన్ ని మహేష్ బాబుకి వినిపించడం కోసం వచ్చాడంట. అయితే మహేష్ బాబు, శ్రీనువైట్ల చెప్పిన స్టోరి లైన్ విని, ఇంకొంచెం డిటైల్డ్ గా చెప్పమన్నాడంట. శ్రీనువైట్ల పూర్తి కథని చెప్నిన తరువాత, అది విన్న ప్రిన్స్ “కథ బాగోలేదు, అయినా మరో అయిదు సంవత్సరాలు నా కాల్షీట్స్ లాక్ అయిపోయాయి” అంటూ వెళ్ళిపోయాడంట. దీంతో శ్రీనువైట్ల షాక్ అయినట్టుగా ఫిల్మ్ నగర్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. నిజానికి దూకుడు మూవీ తరువాత, శ్రీను వైట్ల బాద్ షా మూవీ తెరకెక్కించాడు. ఈ మూవీ తరువాత శ్రీనువైట్ల టీంలో గొడవలు ఏర్పడి కోనవెంకట్, గోపిమోహన్ లు దూరంగా జరిగిపోయారు. ఈ గొడవలో కోనవెంకట్ శ్రీనువైట్ల ని పబ్లిక్ లో తిడితే, గోపిమోహన్ సమయం చూసి బయటకు వచ్చాడు. ప్రస్తుతం శ్రీనువైట్ల దగ్గర సరైన టీం లేదనే టాక్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండటంతో, తనకి మరో అవకాశం ఇవ్వటానికి ప్రిన్స్ సాహసించలేదని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: