చిరంజీవి మోహన్ బాబులు ఒకప్పుడు అనేక సినిమాలలో కలిసి నటించడమే కాకుండా మంచి స్నేహితులుగా ఉండేవారు. అయితే ఆ తరువాత మారిన పరిస్థుతులలో చిరంజీవి మోహన్ బాబుల మధ్య గ్యాప్ పెరిగింది. ఆ గ్యాప్ ఒకరి పై ఒకరు సెటైర్లు వేసుకునే స్థాయి పెరిగి పోయింది.

అయితే ఇటువంటి వైరుధ్యాలు తమ వద్ద ఏమి లేవు అన్నట్లుగా వీరిద్దరూ ఏదైనా ఒక ఫంక్షన్ లో ఎదురు పాడినప్పుడు తెగ ప్రేమను ఒలక పోస్తూ నటిస్తూ ఉంటారు. కాని అసలు కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. అయితే ఈ కోల్డ్ వార్ కు ఒక బాలీవుడ్ హీరో నడిపిన మధ్యవర్తిత్వంతో ముగింపుకు వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.

కేంద్ర సెన్సార్ బోర్డు చైర్మెన్ గా ఎంపిక అయిన పహ్లాజ్ నిహాలిని సత్కార కార్యక్రమం ఈమధ్య హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమాన్ని బాలీవుడ్ సీనియర్ హీరో శత్రుఘ్న సిన్హా ఏర్పాటు చేసాడు. అయితే ఈ కార్యక్రమానికి అతిధులుగా రావడానికి అటు చిరంజీవి ఇటు మోహన్ బాబులు అంగీకరించడమే కాకుండా కార్యక్రమానికి ఆకున్న విధంగా హాజరు కావడం చాలామందిని ఆశ్చర్య పరిచింది.

దీనికి కారణం ఒకే ఫంక్షన్ కు అతిధులుగా చిరంజీవి మోహన్ బాబులను ఆహ్వానించినా వారు మొహమాటానికి ఒప్పుకున్నా చివరి నిముషంలో ఎదో ఒక కారణం చూపించి కార్యక్రమానికి డుమ్మా కొడుతూ ఉండటం ఇప్పటి దాకా ఒక సాంప్రదాయంగా మారింది. అయితే అనుకున్న కార్యక్రమానికి అనుకున్న టైంకు వీరిద్దరూ హాజరవడమే కాకుండా ఆ కార్యక్రమంలో కలిసి సందడి చేయడం మీడియాకు హాట్ న్యూస్ గా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి: