మనీషా కొయిరాల అంటే ముందు గుర్తొచ్చే క్రిమినల్ , బొంబాయ్ , ఒకేఒక్కడు సినిమాల పేర్లు చెప్పగానే ముందు గుర్తొచ్చేది హీరోయిన్ మనీషా కొయిరాల. ఆ సినిమాల్లో చాలా అందంగా కనిపించడంతో పాటు మంచి నటనని కూడా కనబరిచింది మనీషా. దక్షిణ , ఉత్తరాది భాషలలో పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న మనీషా తెరపై కనిపించి దాదాపు నాలుగేళ్ళు అవుతుంది. ఒవేరియన్ కాన్సర్ కారణంగా మనీషా ఈ బ్రేకప్ తీసుకోవలసి వచ్చింది.

విదేశాల్లో చికిత్స చేయించుకొని ఆ వ్యాధి నుంచి బయటపడింది మనీషా. ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. దాంతో సినిమాలు చేయడానికి సిద్దం అయ్యింది. తాజాగా ఈమె అంగీకరించిన మొదటి సినిమా గేమ్. ఈ ఎ.ఎం.ఆర్ రమేష్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో అర్జున్ హీరోగా నటించనున్నాడు.

ఇందులో మనీషా కొయిరాలని నాయికగా తీసుకుంటే బాగుంటుందని అర్జున్ చెప్పడం , దర్శకుడికి కూడా మనీషానే కరెక్ట్ గా ఉంటుందని అనిపించడం జరిగింది. ఈ నేపధ్యంలో మనీషాని కలసి , ఆయన కథ చెప్పారు. ఈ నేపాలీ సుందరి ఈ గేమ్ కథ నచ్చడంతో వెంటనే అంగీకరించింది. గత మూడు , నాలుగు రోజుల్లో మనీషా పాల్గొనగా లుక్ టెస్ట్ చేశారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానున్నది.

. .

మరింత సమాచారం తెలుసుకోండి: