కన్నడ బ్యూటీ ప్రణిత టాప్ హీరోయిన్స్ ను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో పెనుదుమారాన్ని సృష్టిస్తున్నాయి. ‘అత్తారింటికి దారేది’ సినిమా తరువాత తన కెరియర్ పూర్తిగా మారిపోతుంది  అని భావించిన  ప్రణితకు ఆ తరువాత వచ్చిన సినిమాలు ఏమి హిట్  కాకపోవడంతో ప్రణిత కోరుకున్న బ్రేక్  రాలేదు.  ఈమధ్య కాలంలో ఆమెకు సినిమా అవకాశాలు కూడా బాగా తగ్గాయి. 

ఈనేపధ్యంలో ఆమెకు అనుకోకుండా హాట్ బ్యూటీ ఎమిజాక్సన్ వదులుకోవడంతో సూర్య సరసన నటించే అవకాశం ప్రణీతకు వరించింది. ఆ చిత్రం పేరు ‘మాస్’ ఇందులో ప్రధాన హీరోయిన్‌గా నయనతార నటిస్తోంది. ప్రస్తుతం ఈసినిమా పై చాలా భారీ అంచనాలు ఉన్నాయి. ఈనేపధ్యంలో ఈసినిమా షూటింగ్  కోసం వచ్చి ఆసినిమా షూటింగ్ పూర్తి  అయ్యాక బెంగుళూరుకు ఫ్లైట్ లో ఎకానమీ క్లాసులో  ప్రయాణంచేసి అందరినీ ఆశ్చర్య  పరచడమే  కాకుండా అక్కడ తనను పలకరించిన కొంతమంది అభిమానుల వద్ద టాప్ హీరోయిన్స్ పై  సంచలన వ్యాఖ్యలు చేసింది ఈబాపు బొమ్మ. 

సాధారణంగా టాప్ హీరోయిన్స్ అంతా  షూటింగ్ స్పాట్‌లో క్యారవాన్ వ్యాన్ సౌకర్యాలు కావాలని డిమాండ్ చేస్తుంటారు అని, కాని  తానూ మాత్రం అలా నిర్మాతలను టార్చర్ పెట్టనని కామెంట్ చేసింది ప్రణిత. సూపర్‌స్టార్ మమ్ముట్టి, రాహుల్ ద్రావిడ్ లాంటి ప్రముఖులు కూడా ఎకానమీ టికెట్‌తోనే విమానాలలో ప్రయాణం చేస్తోంటే టాప్ హీరోయిన్స్ మాత్రం విమానాలలో బిజినెస్ క్లాస్ లోప్రయాణం చేస్తాము అని డిమాండ్ చేయడం తనకు ఆశ్చర్యం  కలిగించే విషయం అంటూ కామెంట్ చేసింది ప్రణిత. ప్రణిత కామెంట్స్ తో  చాలామంది టాప్ హీరోయిన్స్ ఖంగు తిన్నారని టాక్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: