ఒకప్పుడు తెలుగు, తమిళ సినీ ప్రపంచంలో అతిలోక సుందరిగా కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించిన హీరోయిన్ శ్రీదేవి తర్వాత బాలీవుడ్ కు వెళ్లిపోయింది. అక్కడ కూడా మంచి హిట్లు సాధించింది. తర్వాత నిర్మాత బోనికపూర్ తో వివాహం జరిగింది.  కొంత కాలం గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చింది శ్రీదేవి. ఆమెకు ఇద్దరు కూతుళ్లు ప్రస్తుతం పెద్ద కూతురు జాహ్నవిని సినిమాలో ఎంట్రీ ఇప్పించడానికి తెగ ఉత్సాహపడుతుంది. అసలే సినిమా బ్యాగ్ గ్రౌండ్ తండ్రి పెద్ద నిర్మాత జాహ్నవి కూడా సినిమాల్లోకి రావడానికి ఇప్పటి నుంచి పాపులర్ కావాలని ప్రయత్నిస్తుంది.


ఓ ప్రోగ్రామ్ లో అటెండ్ అయిన జాహ్నవి


పార్టీ కల్చర్ బాగా అలవాటు పడింది ఈ అమ్మడు. ఇప్పటికే తల్లి వెంట పార్టీలకు, సినిమా ఫంక్షన్లకు చిట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని తెగ ఫోజ్ కొడుతుంది. నైట్ పార్టీ లలో తన మిత్రులతో కలిసి బాగానే సోషల్ గా మూవ్ అవుతోంది . ఇప్పటికే పలు సందర్భాల్లో జాహ్నవి తన అతి తో బయటి ప్రపంచం దృష్టిలో పడగా తాజాగా మరిన్ని లేట్ నైట్ పార్టీ లతో అబ్బాయిలతో   రాసుకు పూసుకు తిరుగుతోంది. మరి బాలీవుడ్ ట్రెండ్ అంటే అలానే ఉంటుంది. ఎంత ఎక్కువ ఎక్స్ పోజ్ అయితే అంత పాపులర్ ఫిగర్ అవుతారు అని వాళ్ల నమ్మకం.



శ్రీదేవి, బోనీకపూర్ లతో జాహ్నవి, ఖుషి



మరింత సమాచారం తెలుసుకోండి: