తెలుగు,తమిళ ఇండస్ట్రీలో ఎక్స్ పిచ్చి వై పిచ్చి అంటూ హాట్ హాట్ అందరి మదిని దోచిన తార.. నయన తార. మళియాల కుట్టి అయిన నయన తార తెలుగులో, తమిళంలో అగ్ర హీరోల సరసన వేసింది. తెలుగు లో అయితే బాలకృష్ణతో జోడిగా రెండు సినిమాల్లో నటించి సూపర్ హిట్ కాంబినేషన్ అనిపించుకుంది. తమిళంలో అయితే రజినీకాంత్, అజిత్ లాంటి హీరోలతో తర్వాత కుర్ర హీరోలు శింబు, ఆర్య లాంటి హీరోలతో చేసింది. నయన తార మొదటి నుంచి వివాదాస్పద నాయకిగా పేరు తెచ్చుకుంది. తమిళ హీరో శింబుతో రొమాన్స్ చేసింది తర్వాత ప్రభుదేవతో పెళ్లిదాకా వచ్చి పెటాకులైపోయింది.
శింబుతో రోమాన్స చేస్తూ నయనతార
తర్వాత ఆర్యతో ఎఫైర్లు ఉన్నాయని కోలీవుడ్ కోడై కూసింది, వ్యక్తిగత జీవితంలో ఎన్ని అడ్డంకులు, ఒడిదుడుకులు ఎదురైనా అవేవి తన సినీ కెరియర్పై దెబ్బపడకుండా చాలా జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ తన సెకండ్ ఇన్నింగ్లోనూ దూసుకుపోతున్న ఈ బ్యూటీకి వయసు పెరుగుతున్నా, డిమాండ్ మాత్రం తగ్గనంటోంది. తమిళంలో ఇప్పటికే కొన్ని సినిమాలు చేస్తూ వస్తుంది, ఇప్పుడు టాలీవుడ్ లో టాక్ ఆప్ ది టౌన్ గా మారింది.
ప్రభుదేవతో ఓ ఫంక్షన్లో నయనతార
ఈ ముద్దుగుమ్మను చిరంజీవి నటించే 150వ చిత్రానికి ప్రధాన కథానాయికగా అడిగారట. అందుకు వెంటనే అంగీకరించిన నయన పారితోషికం విషయంలో మాత్రం చిత్ర దర్శక నిర్మాతలు షాక్ తినేలా అడిగిందట. ఏకంగా మూడు కోట్లు ఇస్తేనే అందులో నటిస్తానని మొహమాటం లేకుండా చెప్పేసిందట దీంతో చిత్ర నిర్మాతలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థతి ఏర్పడిందట. ఇదిలా వుండగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ చరణ్, బండ్ల గణేష్ కలసి సంయుక్తంగా నిర్మించే ఈ సినిమాలో రెండో కథానాయికగా అంజలి నటిస్తుందని అంటున్నారు. చిరంజీవి జన్మదినమైన ఆగష్టు 22న ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించి, సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ నిర్వహిస్తారు.