టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నందమూరి బ్రదర్స్ హాట్ టాపిక్ గా మారారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, గత కొంతకాలంగా నందమూరి ఫ్యామిలీలో ఓ భారీ మల్టీస్టారర్ తెరకెక్కనుందనే వార్త తెలిసిందే. బాలకృష్ణ-కళ్యాణ్ రామ్,ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్-బాలకృష్ణ ఇలా రకరకాల కాంబినేషన్లు తెరపైకి వచ్చినా ఏదీ ఫైనల్ కాలేదు.

తాజాగా ఇందులో ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ కాంబినేషన్ ఓ మల్టీస్టారర్ కోసం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రముఖ కథా రచయిత వక్కంతం వంశీ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా మారనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ ఈ సినిమాను స్వయంగా నిర్మించనున్నారట.

వక్కంతం వంశీ చెప్పిన పవర్ఫుల్ కథ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరికీ నచ్చిందని, వారిద్దరూ వెంటనే సినిమాను ఓకే చేశారని ఇండస్ట్రీలో క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి. రచయితలు దర్శకులుగా మారుతున్న సందర్భంలో, ఆ రచయిత డైరెక్ట్ చేసిన మొదటి ఫిల్మ్స్ అన్నీ గ్రాండ్ సక్సెస్ ని అందుకున్నాయి.

ఆ విధంగానే వక్కంతం వంశీ డైరెక్ట్ చేయబోతున్న మొదటికి కచ్ఛితంగా హిట్ అవుతుందని ఎన్టీఆర్ బ్రదర్స్ అంచనా వేశారు. ఎన్టీఆర్‌కు వక్కంతం వంశీ తాజాగా టెంపర్ లాంటి సూపర్ హిట్ సినిమాను అందించిన విషయం తెలిసిందే! కళ్యాణ్ రామ్ నిర్మాణంలో తెరకెక్కిన కిక్ 2 ఈ నెల్లోనే విడుదలవుతున్న విషయం తెలిసిందే. అక్టోబర్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళనున్నట్లు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: