ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయారాజా కుమారుడు ఇప్పటివరకూ యవన్ శంకర్ రాజా అంటే సంగీత దర్శకుడిగానే అందరికీ తెలుసు. అలాంటి యవన్ ఇప్పుడు మరో సరికొత్త అవతారమెత్తబోతున్నాడు. త్వరలో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో సరిగ్గా 100 సినిమాలకు సంగీతం అందించి రికార్డు సృష్టించాడు. యవన్ చేయబోతున్న వందో సినిమా బిర్యానీ. సంగీత దర్శకుడిగా తన సత్తా నిరూపించుకున్నాననీ... చాలా చిన్న వయసులో ఎవరూ సాధించని వంద సినిమాల రికార్డునూ సాధించాననీ గర్వంగా ఫీలవుతున్నాడట యవన్. అందుకే, సంగీతాన్ని వదిలి దర్శకత్వం చేపట్టాలని నిర్ణయించుకున్నాడట. ప్రస్తుతం ఒక కథ రాస్తున్నాడట. త్వరలోనే అది పూర్తవుతుందట. అప్పుడు సినిమాకి నటీనటులను ఎంపికచేసుకుని షూటింగ్ మొదలుపెడతాడట. అదేంటీ, మరి చిత్రాన్ని నిర్మించడానికి నిర్మాత అక్కర్లేదా అంటారా? చెప్పడం మరిచిపోయాం... మొదటి చిత్రానికి తానే నిర్మాత కూడా రెండు పాత్రలు పోషించనున్నాడట. ఇళయరాజా ఈ విషయం విని... పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: