దర్శకుడు పూరి జగన్నాథ్ నిన్న తన ట్విట్టర్ లో పెట్టిన ఒక అందమైన బొమ్మ పూరి జగన్నాథ్ కు అనుకోని సమస్యలు తెచ్చిపెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. వినడానికి చాల విచిత్రంగా ఉన్నా ఈ న్యూస్ మాత్రం వాస్తవం. అందమైన హీరోయిన్స్ ను  వెతికి పట్టుకోవడంలోనే కాదు చాలా అందమైన కళా ఖండాలతో పూరి తన స్వంత ఇల్లు ‘కేవ్’ ను 20 కోట్లు ఖర్చుపెట్టి నిర్మించుకున్న సంగతి తెలిసిందే.

అటువంటి కళాతృష్ణ ఉన్న పూరి ఒక అందమైన చెక్క బొమ్మను తన ట్విటర్ లో పెట్టి తన అభిమానులతో షేర్ చేసుకున్నాడు. అయితే ఈ బొమ్మను చూసిన కొందరు పూరీజగన్నాథ్ పై వెబ్ మీడియాలో సెటైర్లు వేసారు. బొమ్మ అందంగా బాగుంది కాని ఈరోజు అందరూ రాజమౌళి ‘బాహుబలి’ గురించి మాట్లాడుతూ ఉంటే ఆ విషయమై మీ ట్విటర్ లో ఎందుకు స్పందించలేదు అంటూ పూరిని టార్గెట్ చేస్తూ సెటైర్లు వేసారు.

మరికొందరైతే ‘మీ అభిరుచికి థాంక్స్ ‘బాహుబలి’ పై ఎందుకు స్పందించలేదు పురీగారు రాజమౌళిని చూసి అసూయ పడుతున్నారా’ అంటూ ట్విట్ చేసారు. అయితే ఈ ప్రశ్నలకు మాత్రం ఎటువంటి రీట్విట్ ఇచ్చినట్లు ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదు.    

‘బాహుబలి’ సినిమా గురించి పూరీ మాత్రమే కాదు దర్శకులకు ఒక ఖ్యాతి తీసుకు వచ్చిన దాసరి విశ్వనాథ్ లాంటి వాళ్ళు కూడ ఇప్పటి వరకు స్పందించలేదు అన్న విషయం ఆ కామెంట్స్ చేసిన వారికి తెలియదు అనుకోవాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: