తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించిన హీరోయిన్లలో త్రిష ఒకరు. ఈ అమ్మడు వర్షం సినిమాతో గ్లామర్ పాత్రలో నటించి తర్వాత అగ్ర హిరోలతో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.  త్రిష హీరోయిన్ గా ఎంత పాపులారిటీ సంపాదించిందో అంతేకంటే ఎక్కువ వివాదాల్లో పేరు సంపాదించుకుంది. ఈ అమ్మడు ఈ మద్య కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి మళ్లీ సంచలనం రేపింది... పెళ్లికి ముందే విడిపోవడం బెటర్ అంటున్నారు నటి త్రిష. వివాహం, విడిపోవడాలు, కోర్టులు కేసులు అంటూ తలనొప్పి తెచ్చుకోవడం వల్ల ఒరిగేది ఏమిలేదు.

ఆ మధ్య ప్రేమ వదంతులతో ప్రచారాల హోరుకు కేంద్రబిందువుగా మారారు. ఆ తరువాత వ్యాపారవేత్త, సినీ నిర్మాత వరుణ్ మణియన్ తో పెళ్లికి సిద్ధం అయ్యి విస్మయం కలిగించారు. వివాహ నిశ్చితార్థం జరి గి పెళ్లి పెటాకులు అవ్వడంతో మరోసారి హెడ్ లైన్ లతో పత్రికలకెక్కారు. తాజాగా వివాహ వ్యవస్థపై రకరకాల వ్యాఖ్యలు చేస్తూ విస్మయానికి గురి చేస్తున్నా రు.  తాజాగా ఈ భామ చెబుతున్న విషయం ఏంటో తెలుసా పెళ్లి చేసుకొని కాపురం చేసి కొన్నాళ్ళ తర్వాత మనస్పర్ధలు వచ్చి విడాకుల కోసం కోర్టు  చుట్టూ తిరిగే బదులు హాయిగా సహజీవనం చేసి ,ఒకరి అభిప్రాయాలను ఒకరు తెలుసుకొని మసులుకోవచ్చు అప్పుడు కూడా తేడా అనిపిస్తే విడిపోవచ్చు దానివల్ల ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు విడాకుల కోసం కోర్టు కు వెళ్ళాల్సిన అవసరం రాదు అని అంటోంది .

వరుణ్ మణియన్ నిశ్చితార్థ సమయంలో త్రిష


ప్రస్తుత పరిస్థితిలో వివాహం చేసుకుని కోర్టుల ద్వారా విడిపోవడం కంటే, వివాహానికి ముందే ఇద్దరు కలసి మెలసి తిరిగి సరిపడకపోతే విడిపోవడం మంచిదని భావిస్తున్నాను. వివాహానికి ముందు అబ్బా యి, అమ్మాయి సహజీవనం చేయడం అనేది వారి వారి ఇష్టాఇష్టాలను బట్టి ఉంటుంది. వివాహం చేసుకుని విడాకులు తీసుకుంటే జీవితాంతం బాధపడేకంటే ముందే కలిసి మెలిసి తిరిగి విడిపోవడం మంచిదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం అని తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: