సినిమా ఇండస్ట్రీ,సెటబ్రెటీలు, స్పోర్ట్స్ సంబంధించిన వాళ్లూ టటూస్ వేయించుకోవడం ఫ్యాషన్ అయ్యింది. ఇక కొంత మంది ఈ టటూస్ చూపించరాని చోట కూడా వేయించుకొని ఆనంద పడుతుంటారు. ఈ రకమైన ఫ్యాష్ హాలీవుడ్ సెలబ్రేటీస్ కి బాగా అలవాటు. భారత దేశంలో కూడా సినిమా నటీ,నటులు టటూస్ తో పిచ్చెక్కించిన సందర్భాలు చాలా ఉన్నాయి. టటూ వేయించుకోవటం అనేది సినీ స్టార్స్ కి కొత్తేమి కాదు. అయితే వాటిని తన అభిమానులు చూడాలని మరీ ట్విట్టర్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ ద్వారా ప్రచారంలోకి తేవటం మరీ ఎక్కువైంది.

 మోడలింగ్ ప్రపంచంలో మంచి పేరు సాధించాలన్న తపనతో గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుష్క శర్మ ముందుగా లాక్మే ఫ్యాషన్ వీక్ లో మెరుపులు మెరిపించింది. యష్ చోప్రాకు చెందిన యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ ఆమె టాలెంట్ గుర్తించి బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సరసన తొలి అవకాశం ఇచ్చింది. 'రబ్ నే బనాదీ జోడీ' సినిమాలో ఆమె నటన విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.

అనుష్క శర్మ హాట్ ఫోటో



తర్వాత మళ్లీ అదే సంస్థ రూపొందించిన బద్మాష్ కంపెనీలో అనుష్క నటించింది. 2010లో బ్యాండ్ బాజా బారాత్ సినిమాతో యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థతో ఆమె కాంట్రాక్టు పూర్తయింది. 2012లో మళ్లీ షారుక్ ఖాన్ తో సెకండ్ హీరోయిన్ గా 'జబ్ తక్ హై జాన్' చిత్రంలో ఆమె ప్రదర్శించిన నటనకు బాలీవుడ్ దాసోహమంది.  తాజాగా అనుష్క శర్మ టటూస్ ప్రదర్శనతో కుర్రకారుకి పిచ్చెక్కించేలా చేసింది. కోహ్లీతో ప్రేమాయణం నడిపిస్తూనే సినిమాల్లో సందడి చేస్తూన్న అనుష్క ఓ మీడియా కార్యక్రమంలో టటూస్ తో కనువిందు చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: