ఒక టీవీ యాంకర్ గతంలో రాష్ట్రపతిని, గవర్నరు అని లైవ్ కార్యక్రమంలో సంబోధిస్తేనే ఆయన ఎంత మాత్రమూ పట్టించుకోలేదు. కానీ... ప్రస్తుతం ఏదో సేవాకార్యక్రమాలు, టీవీ షోల పేరిట కాలం గడుపుతూన్న ఆ మాజీ హీరోయిన్ మాత్రం.. తన పాత డిజిగ్నేషన్ గురించి పొరబాటుగా ఉచ్ఛరించే సరికి ఓ టీవీషోలో యాంకర్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడిపోయింది. సాధారణంగా ఆమె తత్వం అందరితో సరదాగా ఉండడమే గానీ.. తన డిజిగ్నేషన్లో తేడాను భరించలేకపోయింది. సదరు మాజీ అందాల తార ఎవరో కాదు సుస్మితాసేన్.
వివరాల్లోకి వెళితే.. హీరోయిన్గా అతి స్వల్పకాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని.. ప్రస్తుతం స్వేచ్ఛామయ జీవితాన్ని గడుపుతున్న సుస్మితాసేన్.. ఓ టీవీ రియాల్టీషోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. కార్యక్రమంలో న్యాయనిర్ణేతల గురించి సభికులకు పరిచయం చేస్తూ.. యాంకర్ బాధ్యత చేస్తున్న అమ్మాయి.. సుస్మిత గురించి మాజీ మిస్వరల్డ్ అంటూ పొరబాటుగా ప్రస్తావించింది. దీంతో ఒక్కసారిగా సుస్మిత ఫైర్ అయిపోయింది. తాను మిస్ వరల్డ్ కాదని, మిస్ యూనివర్స్ అని సీరియస్గా చెప్పింది. మిస్ వరల్డ్ కంటె తన స్థాయి పెద్దదని చెప్పుకుంది.
అంత చిన్న పొరబాటుకు అంత కోపం ఎందుకొచ్చినట్లు అనుకుంటే.. బహుశా ఇప్పటికే అందాల ముద్దుగుమ్మగా బాలీవుడ్లో స్థిరమైన ప్రస్థానం సాగిస్తున్న ఐశ్వర్యారాయ్ మీద అక్కసుతోనే ఏమో అని పలువురు అనుకుంటున్నారు. వీరిద్దరూ ఒకే ఏడాది అందాల పోటీలకు వెళ్లారు. ఇండియాలో సుస్మితతో ఐశ్వర్య ఓడిపోయింది. ఇద్దరూ అంతర్జాతీయ స్థాయిలో రెప్రజెంట్ చేయగా, సుస్మిత మిస్ యూనివర్స్గా, ఐశ్వర్య మిస్ వరల్డ్గా నెగ్గారు. సుస్మిత స్థాయి పెద్దదే అయినా బాలీవుడ్ కెరీర్ కొద్దికాలానికే ముగిసిపోయింది. అదే ఐశ్వర్య ఇంకా ఒక వెలుగు వెలుగుతోంది. తనను ఆమె హోదాతో పోల్చేసరికి అక్కసుకొద్దీ సుస్మితకు కోపం వచ్చి ఉండచ్చని పలువురు అనుకుంటున్నారు.