వెండి తెర మీద క్రీడాకారులు కనిపించడం కొత్త కాదు. ఈ కోవలోకి లియాండర్ పేస్ కూడా చేరాడు. రాజధాని ఎక్స్ ప్రెస్ అనే బాలీవుడ్ సినిమాలో లియాండర్ పేస్ నటిస్తున్నాడు. అశోక్ కోహ్లి దర్శకత్వంలో సిని యాక్ట్స్ ప్రొడక్షన్ ఈ రాజధాని ఎక్స్ ప్రెస్ సినిమాను నిర్మిస్తుంది. రైలు లో జరిగే సెస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ఈ రూపొందే ఈ సినిమాలో లియాండర్ పేస్, జిమ్మీ షెర్గిల్, షయాలీ భగత్, గుల్షన్ గ్రోవర్, పుజా బోస్ తదితరులు నటిస్తున్నారు. మనోజ్ కెజ్రివాల్, రాజేష్ పటేల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను 2013, జనవరి 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: