నటిగాను, నిర్మాత గాను రాణించడానికి మంచు లక్ష్మీ ప్రయత్నిస్తుంది. ఆమె నటించి, నిర్మించిన తాజా సినిమా గుండెల్లో గోదావరి. ఈ సినిమాలో ముంచు లక్ష్మీ, ఆది, సందీప్ కిషన్, తాప్పీ ప్రధాన పాత్రల్లో నటించారు. గోదావరి వరదల నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమాకు కుమార్ నాగేంద్ర దర్శకత్వం వహించారు. ఇళయ రాజా అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమాపై మంచు లక్ష్మీ మొదటి నుంచి ధీమా గా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులను అలరించడం ఖాయమని చెబుతూ వస్తుంది. ఈ సినిమాలో గోదావరి ప్రాంతానికి చెందిన యువతిగా మంచు లక్ష్మీ నటించింది. ఈ సినిమాను నవంబర్ 30న విడుదల చేస్తామని అప్పట్లో ప్రకటించారు. అయితే శుక్రవారం నాడు ఈ సినిమా విడుదల కావడం లేదు. అయితే, శుక్రవారం నాడు రానా నటించిన కృష్ణం వందే జగద్గురం భారీ స్థాయిలో విడుదల అవుతుంది. అలాగే, నవదీప్-సదా జంటగా మైత్రీ కూడా విడుదల అవుతుంది. ఈ శుక్రవారాన్ని మంచు లక్ష్మీ మిస్సయ్యింది. గుండెల్లో గోదావరి చిత్రం విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: