తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు వారుసులుగా ఇప్పటికీ చాలా మంది వచ్చారు..నాగార్జున తర్వాత సుమంత్, సుశాంత్,నాగచైతన్య హీరోలుగా వచ్చారు.. కానీ అక్కినేని నాగార్జున కు వచ్చినంత పేరు వీరికి రాలేదు. అంతే ప్రస్తుతం నాగార్జున పెద్ద కొడుకు అక్కినేని నాగ చైతన్య హీరోగా నిలబడటానికి కృషి చేస్తున్నాడు. ఇప్పుడు మరో హీరో ఎంట్రీ ఇస్తున్నాడు.. వాస్తవానికి చిన్నప్పుడే ‘సిసింద్రి’ చిత్రంలో వెండి తెరకు పరిచయం అయిన అక్కినేని అఖిల్ ‘మనం’ చిత్రంలో క్లయిమాక్స్ సీన్లో కనిపించి అదరగొట్టాడు. ఇప్పుడు ఫుల్ లెంత్ హీరోగా వివివినాయక్ దర్శకత్వంలో ‘అఖిల్’ సినిమాలో నటిస్తున్నాడు.
ఈ మద్య ‘అఖిల్’ చిత్రం ఆడియో వేడుకలు జరిగాయి. ఇక అఖిల్ తొలి సినిమా “అఖిల్” ఆడియో లాంచ్ యూఎస్ లో జరిగిన విషయం తెలిసిందే. అయితే మనోడికి అక్కడ చేదు అనుభవం మిగిలింది..తెలుగు సినీపరిశ్రమలో తెరంగేట్రం చేసేందుకు వస్తున్న అఖిల్ తన మొదటి సినిమా విడుదలకు గ్రాండ్ గా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సినిమా ఆడియో విడుదల ఫ్రీమాంట్ నగరంలో సెప్టెంబరు 25న జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో నార్త్ వెస్ర్టన్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ, సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు జై బాలయ్య, జై జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు.
అఖిల్ చిత్రం పోస్టర్
వాస్తవాని అక్కడ నందమూరి ఫ్యాన్స్ ఎక్కువ అంతే కాదు బాలకృష్ణ కూడా ఎన్నో ఈవెంట్స్ కి అక్కడ వెళ్లడం అందరికీ సుపరిచితం కావడంతో వారు అలా తమ అభిమానాన్ని చాటారు..కానీ ఇది అక్కినేని అఖిల్ కి కాస్త భాద కలిగించిందట..దీంతో ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు అఖిల్ ఇబ్బంది పడ్తూనే అక్కడ ఉన్నారు.కార్యక్రమం పూర్తయిన తర్వాత ఏర్పాటు చేసిన డిన్నర్లో అఖిల్ అందరితో కలిసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనూ కొందరు ఇబ్బందికరంగా మాట్లాడటంతో నిరుత్సాహ పడ్డ అఖిల్ అక్కడి నుంచి నిష్కృమించి తాను బసచేసిన హోటల్కు వెళ్లిపోయినట్లు సమాచారం.