ప్రముఖ కొరియోగ్రఫర్, దర్శకులు అమ్మ రాజశేఖర్ మరో వివాదంలో చిక్కుకున్నాడు..గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడి వార్తల్లోక్కి ఎక్కిన అమ్మరాజశేఖర్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.  వివరాల్లోకి వెళితే.. ఎల్లారెడ్డిగూడలో నివాసముండే అమ్మ రాజశేఖర్ ఫ్లాట్ కింది అంతస్థులో కోటిరెడ్డి అలియాస్ వెంకట్ అద్దెకు ఉంటున్నారు.  ఇతడు జిమ్ ట్రైనర్ గా పనిచేస్తున్నాడు.. గత ఆదివారం టీవీ సౌండ్ ఎక్కువగా పెట్టారనే విషయంలో గొడవ చోటుచేసుకున్నది. గొడవ పెద్దది కావడంతో ఇటీవల వెంకట్ ఇంటిని ఖాళీ చేశాడు. మిగిలిన సామాన్లు తెచ్చుకునేందుకు గురువారం తన స్నేహితుడు మోహన్‌కుమార్‌తో అక్కడికి వెళ్లాడు.


 ఆ సమయంలో వెంకట్ ని గమనించి రాజశేఖర్ తనతో మాట్లాడేది ఉందని చెప్పడంతో తన ఫ్లాట్ కు వెళ్లానని హఠాత్తుగా తనపై దాడి చేశాడని పోలీస్ ఫిర్యాదులో పేర్కొన్నాడు వెంకట్. పాత కక్షలు తన మనసులో పెట్టుకుని అమ్మరాజశేఖర్ తన పై దాడికి తెగబడ్డాడని సినిమా సెలబ్రెటీ కావడం తో తనను ఎవరూ ఏం చేయలేరనే ధీమాతో ఆయన అలా ప్రవర్తించాడని ఫిర్యాదు దారుడు పేర్కొన్నాడు. ఆ మద్య బుల్లి తెరపై ‘ఆట’, ‘రంగం’ ప్రోగ్రామ్ లో జడ్జీగా వచ్చారు.. తర్వాత గోపిచంద్ తో ‘రణం’ సినిమా తీశాడు.


రణం 2 చిత్రం లో అమ్మరాజశేఖర్


కొరియోగ్రాఫర్, డైరెక్టర్ పని చేసిన అమ్మరాజశఖర్ ప్రస్తుతం అటు వెండితెరపై ఇటు బుల్లి తెరపై కనిపించడం లేదు.  అ మద్య ‘రణం 2’ సినిమా తో హీరోగా ఎంట్రీ కూడా ఇచ్చాడు.  గతంలో కూడా అమ్మ రాజశేఖర్ ఇలాంటి వివాదాల్లో ఇరుక్కున్నాడు. ఓసారి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కూడా ఇరుక్కున్నాడు.  మరో వైపు తాను ఎవరిపై దాడి చేయలేదని అమ్మ రాజశేఖర్ అంటున్నారు. కొంతమంది యువకులు తన ఇంటిపై దాడి చేశారని, పోలీసుల రావడంతో పారిపోయారని చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరపడానికి సమాయత్తమవుతున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: