మరొక తెలుగు యువకుడు అమెరికాలో బలై పోయాడు..ఎన్నో ఆశలతో భవిష్యత్తులో ఒక మంచి హోదాకి వెళ్లి  ఎంతో ఉన్నతంగా బ్రతకాలి అనుకున్న ఒక యువ ఇంజనీరు ఆశలు అడిఆశలు అయ్యాయి...పుట్టినరోజు వేడుకలు చేసుకుని తిరిగి భార్యా ,స్నేహితులతో ఇంటికి తిరుగు ప్రయాణం చేసిన ప్రదీప్హ టాత్తుగా జరిగిన ప్రమాదం కారణంగా తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయాడు..పుట్టినరోజునాడే ప్రాణాలు పోగొట్టుట్టుకున్నాడు ప్రదీప్..వివరాలలోకి వెళ్తే..

Related image

తెలంగాణా రాష్ట్రం భువనగిరికి  చెందిన ప్రదీప్ ఎనిమిదేళ్ళ క్రితం అమెరికాలో వెళ్లి సాఫ్ట్ వేర్ జాబ్ లో స్థిరపడ్డాడు..గత సంవత్సరం  భువనగరికే చెందిన అమ్మాయితో ప్రదీప్ కి వివాహమైంది. అనంతరం భార్యను కూడా అమెరికా తీసుకెళ్లాడు. తన పుట్టినరోజు వేడుకలని పురస్కరించుకుని బయటకి వెళ్లి తిరిగి వస్తున్న ప్రదీప్ అనూహ్యంగా చనిపోయాడు.

 

అధికారులు చెప్పిన వివరాల ప్రకారం పుట్టినరోజు వేడుకలు ముగించుకుని ఒక మినీ బస్సులో ప్రయాణిస్తున్న ఇరువురు హటాత్తుగా బస్సు ప్రమాదానికి గురికావడంతో ప్రదీప్‌ అక్కడిక్కడే మృతిచెందారు. నార్త్‌కరోలీనాలో  ఆదివారం ఈ సంఘటన జరిగింది. ప్రమాదంలో ప్రదీప్‌ భార్య కార్తీకతోపాటు మరికొందరికి తీవ్రంగా గాయాలు అయ్యాయి అని తెలుస్తోంది..మృతుడు భువనగిరి మాజీ కౌన్సిలర్‌ మురళి కుమారుడు...ఈ విషయం తెలుసుకున్న కుటుంభ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

 

 

 

 


 

 


మరింత సమాచారం తెలుసుకోండి: