భారతీయ
ఎన్నారై కి అదృష్టం కలిసొచ్చింది..నాలుగేళ్ళుగా వేచి చూస్తున్న లక్కు ఒక్కసారిగా
అనుకోకుండా తగిలింది అంతే రాత్రికి రాత్రే
కోటీశ్వరుడు అయిపోయాడు..సరిగ్గా 20 రోజుల క్రితం ఇదే తరహాలో కేరళా నుంచీ
దుబ్బాయి వెళ్ళి అక్కడ మెకానిక్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తికి కూడా దాదాపు 14 కోట్ల
లాటరీ తగిలింది..అయితే ఈ సారి మరో భారతీయ
వ్యక్తికి ఈసారి భారీ లాటరీ తగలడం గమనార్హం..వివరాలలోకి వెళ్తే..
యూఏఈలోని దుబాయ్ నగరంలో నివాసముంటున్న.. భారత్కు చెందిన ఎస్ఆర్. షేనే కి లక్కు బాగా కలిసొచ్చింది.. డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలీనియర్ లక్కీ డ్రాలో విజేతగా నిలిచాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.6.69 కోట్ల( 1మిలియన్ డాలర్లు) సంపన్నవంతుడిగా మారిపోయాడు. .
అయితే షేనే 269 సీరిస్లోని కొనుగోలు చేసిన 2916 నంబర్ టికెట్పై ఈ అదృష్టం దక్కింది. గత నాలుగేళ్లుగా అనేక లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేశానని, ఇప్పటికి తన అదృష్టం కలిసి వచ్చిందని షేనే చెపుతున్నాడు. ఈ సందర్భంలో దుబాయ్ డ్యూటీ ఫ్రీకి ధన్యవాదాలు తెలిపాడు అతి త్వరలోనే డ్యూటీ ఫ్రీని సందర్శిస్తానని తెలిపాడు ఇదిలాఉంటే అంటూ ఇప్పటి వరకూ దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలీనియర్నులో దాదాపు 129 ఈ లక్కీ డ్రాలని సాధించుకున్నారు.