అమెరికాలో జరిగిన మధ్యంత
ఎన్నికల్లో ట్రంప్ కి తగిలిన షాక్ మాములుగా లేదు..డెమొక్రాట్ల విజయంతో ట్రంప్ పై
ఎలాంటి అమెరికాలో ఎలాంటి వ్యతిరేక పెల్లుబుకుతోందో అర్థం అయ్యింది..సరే ఇక
అమెరికాలో పోటీ చేసిన భారతీయుల పరిస్థితికి వస్తే..కీలకం అయిన మధ్యంతర ఎన్నికల్లో
మనోళ్ళు సత్తా చూపించారు.
ఇప్పటి వరకూ ఉన్న రాజా కష్ణమూర్తి, ప్రమీలా జయపాల్, రో ఖన్నా, అమీ బెరా మళ్లీ ఎన్ని ఈ సారి కూడా ఎంపికయ్యారు..కొత్తగా పోటీ చేసిన భారతీయులు సైతం గట్టిగా పోటీని ఇచ్చినా గెలుపు వరకూ రాలేక పోయారు అయినా తరువాత జరిగే అసలు సిసలు పోరులో మాత్రం వారి గెలుపు తధ్యమని తెలుస్తోంది.
అయితే పాల్గొన్న వారిలో అప్పటికే ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురితో సహా 12 మంది ప్రతినిధుల సభకు పోటీ చేయగా, ఒకరు సెనెట్ బరిలో ఉన్నారు. ప్రతినిధుల సభకు పోటీ చేసిన వారిలో అరడజనుకుపైగా 'సమోసా కాకస్' సభ్యులు తమ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తారని ప్రచారం జరగడంతో ఈ ఎన్నికలపై సర్వతా ఆసక్తి నెలకొంది.