అమెరికా
అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న భారత సంతతి హిందూ మహిళ తులసీ గబ్బార్డ్ తన ప్రచారాన్ని
మొదలు పెట్టారుల. డెమోక్రటిక్ పార్టీ తరుపున ఆమె అధ్యక్ష పదవి రేసులో ఉన్న విషయం
అందరికి తెలిసిందే. అయితే తాజాగా ఆమె తన ప్రచారాన్ని మొదలు పెట్టారు. స్వదేశంలో ,
విదేశాల్లో శాంతిస్థాపన దిశగా తన అడుగులు ఉంటాయని ఆమె తెలిపారు.
అందుకు గాను ఉద్యమించే ప్రతీ ఒక్కరూ తనతో చేతులు కలపాలని ఆమె ప్రజల్ని కోరారు. అందరికీ స్వేచ్ఛ, న్యాయం, సమానత్వం, అవకాశాలు అందేలా చేయడమే అమెరికా అసలు ఉద్దేశ్యమని కాని కొందరు వీటిని కాలరాస్తున్నారని ట్రంప్ పై పరోక్ష విమర్శలు చేశారు.
ఈరోజు నుంచీ నా ప్రచారాన్ని మొదలు పెడుతున్నాను అంటూ ట్విట్టర్ వేదికగా ఆమె తెలిపారు. ఇదిలాఉంటే డెమోక్రటిక్ పార్టీ తరుపునుంచే మరో భారత సంతతి మహిళ కమల హరీస్ సైతం అధ్యక్ష రేసులో ఉండటం గమనార్హం ఇప్పటికే ఆమె ప్రచారాని మొదలు పెట్టి ప్రజలలో భారీగా మద్దతు కూడగడుతున్నారు.