కీరవాణి సంగీతం.. తమన్నా మెరుపులు.. 

తెలుగు సాంస్కృతిక, ఆధ్యాత్మిక, ఆట పాటలతో హోరెత్తిన ఇర్వింగ్ 

అమెరికాలో నాట్స్ అంగరంగ వైభవంగా జరిపే అమెరికా తెలుగు సంబరాలు రెండోరోజు కూడా ఎంతోఘనంగా జరిగాయి. ఉదయం నుంచే సంబరాల సందడి మొదలైంది. ఇర్వింగ్ వేదికగా జరుగుతున్న ఈసంబరాల్లో రెండో రోజు గరుడగమన శ్రీనివాస కళ్యాణం పేరుతో చేసిన శాస్త్రీయ నృత్యం సంప్రదాయవాదులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత మనబడి చిన్నారుల చేసిన అష్టావధానం రూపకం ఔరాతెలుగు పిడుగులు అనిపించింది. సంబరాలకు విచ్చేసిన వారిని ఉత్సాహంతో చిందేసేలా చేసేందుకుమాస్ మెడ్లీ రంగంలోకి దిగి తెలుగు సినిమా పాటలకు డ్యాన్స్ లు వేశారు. వేయించారు. అందమైనభామలతో డ్యాన్స్ మెడ్లీ చేసిన డ్యాన్స్ మేజిక్ కూడా ఆకట్టుకుంది. గిరిజన సంప్రదాయాలనుప్రతిబింబిస్తూ చేసిన అడవితల్లి గిరిజన నృత్యానికి మంచి స్పందన లభించింది. ఇక ఆ తర్వాత డ్యాన్స్మెడ్లీ డ్యాన్స్ వారియర్స్  పేరుతో మరోసారి సినిమా పాటలకు డ్యాన్స్ లు చేయించారు.  హ్యూస్టన్ చాప్టర్రూపొందించిన నృత్య కార్యక్రమానికి కూడా మంచి స్పందన వచ్చింది.  సంప్రదాయ భారతీయ వస్త్రాలుధరించి.. ప్రత్యేక అలంకరణలతో సాగిన తెలుగోత్సవం కార్యక్రమం కూడా విశేషంగా ఆకర్షించింది. ఆతర్వాత కూచిపూడి నృత్యం.. సంప్రదాయ నృత్య ప్రేమికులను కట్టిపడేసింది. 


తెలుగుపాటల మిక్స్ చేసిన టాలీవుడ్ టీజర్ డ్యాన్స్ కు అద్భుతమైన స్పందన లభించింది.దేశభక్తినిప్రతిబింబిస్తూ... ప్రియభారతీ జననీ అని చేసిన నృత్యానికి అందరూ జైహింద్ అంటూ అభినందనలుతెలిపారు. సరదాగా మరదలిపిల్లను ఆటపట్టిస్తూ.. గళ్లు.. గళ్లు..చప్పుళ్లు.. అంటూ  సాగిన జానపదనృత్యంమన గిరిజన సంస్కృతిని గుర్తు చేసింది. .. రాజే.. కింకరుడగును.... కింకరుడే.. రాజగున్... అంటూ ఆ సత్యహరిశ్చంద్ర చెప్పిన జీవన సత్యాలను తెలగు సినీ గాయకుడు ప్రవీణ్ అద్భుతంగా ఆలపించారు. ఆతర్వాత మా వాణి.. బాణి.. అంటూ గేయరచయితలు.. గాయకులు కలిసి చేసిన జుగల్ బందీ కూడాఅందరిని విశేషంగా ఆకట్టుకుంది. ఓ చినదాన అంటూ రాయలసీమజానపదగీతానికి చేసిన నృత్యం.. రాయలసీమ సంస్కృతిని ప్రతిబింబించింది. ఈశా గీరిశా.. అంటూ ఆ పరమశివుడిని స్తుతిస్తూ చేసిననృత్యం కూడా విశేషంగా ఆకట్టుకుంది. అడవిచుక్కలు పేరుతో చేసిన గిరిజన నృత్యానికి మంచి స్పందనలభించింది. స్థానిక తెలుగువారిలో ప్రతిభను ప్రోత్సాహిస్తూ.. వారిలో సంగీత పాటవాన్ని వెలికితీస్తూ చేసినకార్యక్రమం... స్వరవర్షిణికి విశేషంగా స్పందన లభించింది.  


రైతు రాజ్యమే.. రామరాజ్యం అనేది చాటిచెబుతూ.. రైతుల జీవితాలపై అన్నదాత సుఖీభవ అంటూచేసిన నృత్యరూపకం విశేషంగా ఆకట్టుకుంది. సంగీత నవవేదం పేరిట మీగడ రామలింగ స్వామి చేసినకార్యక్రమానికి మంచి స్పందన లభించింది. తెలుగు బ్రూసిలి.. వివేక్ చిరుపల్లి చేసిన స్కిట్, జబర్ధస్ట్ఆర్టిస్టులతో చేసిన కామెడీ ప్రోగ్రామ్ నవ్వులు పువ్వులు పూయించింది.


ఉదయం నాట్స్ బోర్డు మరియు కార్యవర్గ కమిటీ ల మీటింగ్ లు జరిగాయి. రెండో రోజు సాయంత్రంపురస్కారాల ప్రదానం జరిగింది. షార్ట్ ఫిల్మ్ విభాగంలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.తెలుగు హీరోయిన్ డ్యాన్స్  అందరిని అలరించింది. నీవు పెద్దపులి అంటూ చేసి జానపద నృత్యం..అందరిని  చిందులు వేయించింది. ఆ తర్వాత రప్తార్ హంగామా.. అందరిలో హుషారు నింపింది. పాప్ సింగర్ స్మిత వల్లూరుపల్లి, మిస్ టీన్ యూ.ఎస్ 2019 ఈషా కోడె లతో వుమెన్ ఫోరమ్ నారీ భేరి 2019, అటలు, డొమెస్టిక్ వయొలెన్స్, సెల్ఫ్ డిఫెన్స్ ఫర్ విమెన్ అండ్ గర్ల్స్, షేర్ యువర్ ప్యాషన్ విత్ సర్ప్రైజ్ సెలెబ్రిటీ వంటి కార్యక్రమాలు అందరినీ అలరించాయి.


జననీ జన్మభూమి.. అంటూ చేసిన నృత్యం భారతీయ సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబించేలాచేసింది. ఆ తర్వాత సంబరాలకు వచ్చిన తారలకు సత్కారం జరిగింది. టాలీవుడ్ టాప్ స్టార్ తమన్నస్టేజ్ మీదకు రావడం.. మాట్లాడటం.. ఇవన్నీ సంబరాల్లో యూత్ మంచి కిక్ ఇచ్చాయి. ఆ తర్వాత సేవాపురస్కారాలను అందించారు. ఇక సంబరాలకు అసలు సిసలైన ముగింపుత్సోవం కీరవాణి సంగీతవిభావరి అందరిని అలరించింది. తెలుగు సినీ పాటల ప్రవాహంలో సంబరాలకు వచ్చిన ప్రతివారు తడిసిముద్దయ్యేలా చేసింది. హోరెత్తే సినీ పాటలకు అందరూ కలిసి చిందేశారు. సంబరాల సంతోషంలోమునిగితేలారు. దాదాపు 8 వేల మందికి పైగా ఈ  సంబరాల సంతోషంలో పాలుపంచుకున్నారు.. వచ్చేతెలుగు సంబరాలు 2012లో న్యూజెర్సీ వేదికగా జరగనున్నాయని నాట్స్ సంబరాల వేదికగా బోర్డుసభ్యుడు మరియు కన్వెన్షన్ సెలక్షన్ కమిటీ చైర్ కొత్త శేఖరం ప్రకటించారు.


చివరగా జన్మభూమి నాదేశం సదా స్మరామి అంటూ సాగిన కీరవాణి బృంద ఆలాపనలో నటుడు సాయికుమార్ కూడా గొంతు కలిపారు.


సంబరాల కార్యక్రమాలను కవరేజ్ చేసిన ప్రతీ మీడియా సంస్థను చైర్మన్ గుత్తికొండ శ్రీనివాస్, ప్రెసిడెంట్శ్రీనివాస్ మంచికలపూడి, సంబరాల కమిటీ చైర్మన్ కిశోర్ కంచర్ల మరియు కమిటీ ఇతర సభ్యులుపేరుపేరునా అభినందించారు. ఈ సంబరాలలో గ్రాండ్ స్పాన్సర్స్ గా ఉన్న యువికా జెవెల్స్, శ్రీకృష్ణ, పి.ఎమ్జే వంటి ఇతర సంస్థలు, బోటిక్ నిర్వాహకులకు సంబరాల కమిటీ నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు.


ఇన్ని వేల మందిని రకరకాల విందు భోజనాలతో ఆనంద పరిచిన బావార్చి బిర్యానీకి బోర్డు, కమిటీ సభ్యులేకాక సంబరాలకు విచ్చేసిన అతిధులు ప్రతీ ఒక్కరూ అభినందనలు తెలియచేశారు.


వందన సమర్పణ తో 2019 అమెరికా తెలుగు సంబరాలు ముగిశాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: