అమెరికాలోని  కాలిఫోర్నియాలో కొన్ని రోజుల క్రితం ఓ సిక్కు వ్యక్తి పై జరిగిన హత్యా ఉదంతం ఆ ప్రాంతంలో ఎంతటి కలకలం సృష్టించిందో అందరికి తెలిసిందే. ట్రేసీలోగల గ్రెట్చెన్ టాలీ పార్క్ లో పరంజిత్ సింగ్ అనే సిక్కు వ్యక్తిపై అత్యంత కిరాతకంగా కత్తితో దాడి చేసి చంపేశాడు ఓ గుర్తు తెలియని వ్యక్తి. ఈ ఘటనతో మరోసారి జాత్యహంకార దాడులు మొదలయ్యాయని భారతీయులు అందోళన చెందారు కూడా.

 

అమెరికాలోని సిక్కు వర్గాలు, భారత ఎన్నారైలు న్యాయం జరగాలి అంటూ కొవ్వొత్తుల ర్యాలీ కూడా చేపట్టారు. కుటుంభ సభ్యులు స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ కేసు విషయాన్ని ఛాలెంజ్ గా తీసుకున్నారు. హంతకుల కోసం తీవ్ర గాలింపులు చేపట్టారు. సీసీ టీవీ పుటేజ్ లు, ఘటనా స్థలంలో దొరికన ఆధారాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

 

ఎట్టకేలకి ఆ హత్య చేసింది 21 ఏళ్ళ క్రెయిటర్ రోడ్స్ గా గుర్తించారు. వారం పాటు అతడిని పరిశీలించి చివరికి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం విచారణ చేస్తున్నామని, అతడు ఉంటున్న ఇంటిని కూడా సోదాలు చేశామని, ఈ హత్యకి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు మీడియాకి తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: