కాలం మరీనా ఆడవారిపై జరిగే అన్యాయాలు తగ్గటం లేదు. ఇష్టం వచ్చినట్టు ఆడవారిని చిత్రహింసలు పెడుతున్నారు. పెళ్లి చేసుకున్నప్పుడు భార్యను ఆకాశానికి ఎత్తి మరోసాటి రోజే పాతాళానికి తోక్కేస్తున్నారు కొందరు భర్తలు. ఎన్నో కలలతో భర్తతో పాటు అమెరికాకు వెళ్ళింది ఓ భార్య. 


వెళ్లిన రెండో రోజు నుంచే భార్యను హింసించడం మొదలు పెట్టాడు ఓ ఎన్నారై. ముంబైకి చెందిన మహమ్మద్ జుబెర్ ఫరూఖీ అమెరికాలో సెటిల్ అయ్యాడు. 2008లో ముంబైకి చెందిన ఓ యువతిని జుబెర్ పెళ్లాడి తనతో పాటు అమెరికాకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత కొన్నిరోజులకే ఆమెని హింసించడం మొదలు పెట్టాడు. 


బాగా తాగి వచ్చి భార్యను ఇష్టం వచ్చినట్టు కొట్టేవాడు. అవి అన్ని భరించిన ఆ భార్యను చివరకు మెదపట్టుకొని ఇంట్లోంచి గెంటేశాడు. దీంతో ఎటుపోవాలో తెలియని ఆమె తెలిసిన వారి సహాయంతో ఇండియాలోని తన పుట్టింటికి చేరింది. ఆపై తన భర్తపై గృహ హింస కేసు వేసి కోర్టుకు లాగింది. 


అయితే ఆ ఎన్నారైకు కోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. ఆమెకి ఖర్చుల నిమిత్తం ప్రతి నెల 15 వేల నుంచి 30 వేల వరుకు ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఇవ్వను అని బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన హైకోర్టు జుబెర్‌దే తప్పని బాధితురాలుకు కింది కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రతి నెల డబ్బు ఇవ్వాలని లేదంటే కఠిన చర్యలు తీసుకకోవాల్సి వస్తుంది అని సూచింది. దీంతో ఆ ఎన్నారై భర్త నోరు మెదపకుండా ఓకే చెప్పాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: