ఓ
పాకిస్థాన్ వ్యక్తికి నలుగురు భార్యలు ఉన్నారు. నలుగురు భార్యలు ఇప్పుడు మాములే కదా అని అనుకుంటున్నారా ? మాములే కానీ ఇక్కడ ఈ వ్యక్తి ఓ సంచలనం సృష్టించాడు. ఇద్దరు
పాకిస్థాన్ మహిళలను
పెళ్లి చేసుకోగా మరో ఇద్దరు భారతీయ మహిళలను
పెళ్లి చేసుకున్నాడు. అయితే నలుగురు భార్యల ముద్దుల మొగుడికి ముచ్చటగా పదిమంది పిల్లలు పుట్టారు.
అయితే
పాకిస్థాన్ లో ఇద్దరు భార్యలు ఆ వ్యక్తికి దూరంగా ఉండగా
భారత్ కి చెందిన ఇద్దరు భార్యల్లో ఒకరు అతనితోనే నివసిస్తుండగా మరొక భారతీయ
భార్య భారత్ లోనే తన ఇద్దరు కూతుళ్లతో నివసిస్తుంది. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు బయటకు వచ్చింది అంటే.. నలుగురు భార్యలు ఉన్న వ్యక్తికి అతనితో పాటు ఉండే భార్యకు కష్టం వచ్చింది. ఆ కష్టాన్ని చూసి ఆ వక్తి తట్టుకోలేక పోతున్నాడు.
ఇంతంకి ఆ కష్టం ఏంటి.. వాళ్ళ పేర్లు ఏంటి అని అనుకుంటున్నారా ? అదేనండి.. నలుగురు భార్యల ముద్దుల
భర్త పేరు రషీద్ ఖాన్, అతని నాలుగో
భార్య కాజల్ రషీద్ ఖాన్ అనే
మహిళ 1996లో రషీద్ ఖాన్ ను
పెళ్లి చేసుకుంది. వారిద్దరూ ప్రస్తుతం షార్జాలో స్థిరపడ్డారు. అయితే ఆమె భారతీయురాలు, హిందూ కావడంతో ఆమె
పెళ్లి తర్వాత తన పేరును, మతాన్ని, జాతీయతను మార్చుకుంది.
అయితే అప్పటి నుండి పూర్తిగా పాకిస్థాన్కు చెందిన మహిళగా గుర్తింపును మార్చుకుని షార్జాలో స్థిరపడింది. ఇప్పుడు ఆ మార్పులే ఆమెకు పెద్ద తిప్పలు తెచ్చిపెట్టాయి. జులై 31న ఆమె
పాకిస్థాన్ ఐడెంటిటీ కార్డును రెన్యూవల్ చేసేందుకు దరఖాస్తు చేసుకోగా నాలుగు నెలల అయినా ఆమె రెన్యూవల్ మాత్రం పెండింగ్లోనే ఉంది.
మాములుగా అయితే ఈ రెన్యూవల్ ప్రాసెస్ ఏడు నుంచి పది రోజుల్లో అయిపోతుంది.
కాజల్ రెన్యూవల్ను మాత్రం అధికారులు ఇంకా పెండింగ్ లో పెట్టారు. దీంతో
భర్త రషీద్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. తన
భార్య పాకిస్థాన్ పాస్పోర్ట్,
పాకిస్థాన్ సిటిజెన్షిప్ సర్టిఫికెట్ కలిగి ఉన్నప్పటికీ అధికారులు ఐడెంటిటీ కార్డ్ రెన్యూవల్ను హోల్డ్లో పెట్టారని అతను వాపోయాడు. అధికారులు దీనిపై వెంటనే స్పందించాలని లేదంటే తాను కోర్టుకు వెళ్తానని చెప్పాడు. మరి అధికారులు దీనిపై ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.