కొంతమంది మహిళలు.. భర్త ఎంత నరకం చూపించిన బయటకు చెప్పలేరు. ఈరోజు కాకపోతే రేపు మారుతాడులే అని ఎదురు చూస్తారు.. కానీ మారడం పక్కన పెట్టి ఇంకా ఇంకా భార్యకు నరకం చూపిస్తే.. ఏ భార్య అయినా ఎందుకు ఓర్పుగా ఉంటుంది ? భర్త బాగోతాన్ని అంత బయట పెట్టి చుక్కలు చూపిస్తుంది. అలానే గల్ఫ్ లో ఓ భారతీయ మహిళా భర్త అర్చకలని బయట పెట్టింది. 


ఇంకా వివరాల్లోకి వెళ్తే.. భారత్‌ లోని బెంగుళూరుకు చెందిన జాస్మిన్‌ సుల్తాన్‌ అనే మహిళకు మహ్మద్‌ ఖిజార్‌ ఉల్లా అనే వ్యక్తితో ఏడేళ్ల క్రితం వివాహమైంది. అయితే ఉద్యోగరీత్యా ఇద్దరు షార్జాలో స్థిరపడ్డ వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే షార్జాకు వెళ్లిన రెండో రోజు నుంచి దుర్బషతో, మానసికంగా హింసించడం మొదలు పెట్టాడు. 


ఆ హింస అలాగే కొనసాగినప్పటికీ ఇటీవల భర్త నుంచి వేధింపులు ఎక్కువ అయ్యాయి. తనపై హింసాత్మకంగా దాడి చేస్తున్నాడని నవంబర్‌ 12న ఓ వీడియోను ట్వీట్‌ చేసింది. అంతేగాక తమ పాస్‌పోర్టులను, బంగారాన్ని లాక్కొన్ని చిత్ర హింసలు పెడుతున్నాడని ఆమె వాపోయింది. 


భర్త నుంచి తనను, పిల్లలను రక్షించి సొంత ఊరు అయిన బెంగుళూరుకు పంపాలని కోరింది. తనకు షార్జాలో తెలిసిన వారు ఎవరూ లేరని పోలీసులను వేడుకుంది. ఇక దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మహ్మద్‌ ఖిజార్‌ ఉల్లాను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: