అమెరికాలో భారతీయుల  వరుస మరణాలు అందోళనలు కలిగిస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఓ హోటల్ లో జరిగిన కాల్పుల ఘటనలో మైసూర్ కి చెందిన అభిషేక్ అనే విద్యార్ధి మరణించగా. తాజాగా అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ లోని విజయవాడకి చెందిన గోపిశెట్టి వైభవ్ అనే యువకుడు మృతి చెందారు. అతడితో పాటు జూడీ స్థాన్లీ అనే యువతి కూడా మృతి చెందింది. అయితే జూడిది కూడా భారత దేశమని సన్నిహితులు తెలిపారు. వివరాలోకి వెళ్తే...

 

అమెరికాలోని థాంక్స్ గివింగ్ డే సెలవుల హడావిడి కోలాహలంగా ఉంది. ఈ క్రమంలోనే నోలెన్స్ విల్ వద్ద ఉన్న వాల్ మార్ట్ నుంచీ వైభవ్ , జూడి తమ నిస్సాన్ సెంట్రా కారులో రోడ్డు దాటుతున్న క్రమంలో డేవిడ్ అనే వ్యక్తికి చెందిన ట్రక్ అతివేగంగా వచ్చి డీ కొట్టడంతో తునాతునకలు అయ్యిందని కారులో ఉన్న ఆ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

 

 

అయితే ఈ ప్రమాదానికి కారణం అయిన ట్రక్ డ్రైవర్ డేవిడ్ పారిపోయాడని ,అతడికోసం గాలింపు చర్యలు చేపట్టామని త్వరలో అతడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఇదిలాఉంటే. వైభవ్, జూడి ఇద్దరి మృతదేహాలు స్వదేశాలకి తరలిచేందుకు వారి స్నేహితులు Go Fund Me ద్వారా నిధులు సేకరిస్తున్నారు. వారి కోసం డొనేట్ చేయడానికి ఒక లింక్ ని కూడా షేర్ చేశారు.

https://www.gofundme.com/f/funeral-for-vybhav-gopisetty-and-judy-stanley

మరింత సమాచారం తెలుసుకోండి: