పాకిస్థాన్ పేరు చెప్తే గుర్తొచ్చేది ఉగ్రవాదులు, వారు చేసే మారణహోమాలు, భారత్ టార్గెట్ గా వారు చేస్తున్న ఆగడాలు. వారు ఎప్పటికప్పుడు ఇండియా పై దాడికి యత్నిస్తూనే ఉంటారు. అయితే మన ఇండియన్ ఆర్మీ వారిని ఎప్పటికప్పుడు మట్టికరిపిస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు పాకిస్థాన్ నుంచీ భారత్ పైకి కొత్త ఉగ్రవాదులు వచ్చారు. వీరు నేరుగా గుజరాత్ రైతులపై  తమ ప్రతాపాని చూపిస్తున్నారు.

 

అదేంటి పాకిస్థాన్ ఉగ్రవాదులు రైతులపై ప్రతాపాన్ని చూపడం ఏమిటి అనుకుంటున్నారా. అసలు విషయం ఏమిటంటే. భారత ఆర్మీ కళ్ళు గప్పి ఉగ్రవాదులు భారత్ లో చొరబడినట్టే, పాకిస్థాన్ నుంచీ గుజరాత్ లోకి చొరబడిన ఈ కొత్త ఉగ్రవాదులు అక్కడి రైతులకి చుక్కలు చూపిస్తున్నారు. ఇంతకీ ఈ కొత్త ఉగ్రవాదులు ఎవరు..?? భారత ఇంటిలిజన్స్ కి ఈ విషయం తెలిసిందా అసలు గుజరాత్ రైతులని ఎందుకు టార్గెట్ చేశారు అనే వివరాలోకి వెళ్తే..

 

పాకిస్థాన్ నుంచీ వచ్చి గుజరాత్ రైతులని టార్గెట్ చేసిన కొత్త ఉగ్రవాదులు ఎవరో కాదు మిడతలు. ఓరిని ఇప్పటి వరకూ చెప్పింది మిడతలు గురించా అని తేలిగ్గా తీసిపారేయకండి. పాకిస్థాన్ సరిహద్దుల నుంచీ గుజరాత్ లోకి ప్రవేశించిన ఈ మిడతలు గుజరాత్ లోని పంట పొలాలపై పడి పంటలని నాశనం చేస్తున్నాయి. ఎన్ని రకాల పురుగు మందులు జల్లుతున్నా సరే ఈ మిడతలు చావడంలేదని అక్కడి రైతులు తలలు పట్టుకుంటున్నారు.

 

పదేళ్ళ క్రితం ఇలాంటి సంఘటన జరగడంతో పంటపొలాలు పాడయ్యి తీవ్ర నష్టపోయామని మళ్ళీ ఇలా జరగడంతో ఆందోళన చెందుతున్నామని అంటున్నారు గుజరాత్ రైతులు. భారత్ లోకి వచ్చిన ఉగ్రవాదులని మట్టుబెడుతున్నాం కానీ మిడతలని ఏమి చేయలక పోతున్నాం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: