ఈమధ్యకాలంలో ఎక్కువ మంది భార్యలు భర్తలను చంపేస్తున్నారు. భర్తను చంపి ఆ స్థానంలోకి మరొకరిని తీసుకురావటం.. వారి ముఖంపై యాసిడ్ పోసి కాలింది అని చెప్పి నమ్మించడం.. మరికొందరు భర్తను చంపి ఏకంగా శవాన్ని మాయం చెయ్యడం.. ఇలా ఎక్కువగా భర్తలను చంపే భార్యలు ఎక్కువ అయిపోయారు.

 

ఆలా చేసేవారిలో ఈవిడ ఒకరు. అసలు భర్త ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోకుండా ఉంటె సరిపోతుంది కదా.. పెళ్లి చేసుకోవడం ఎందుకు.. భర్తను టార్చర్ చెయ్యడం ఎందుకు ? భర్తను చంపడం ఎందుకు.. సరే లెండి. భర్తలు కూడా ఎం తక్కువ లేరు. కాకపోతే ఈ కాలంలో భర్తల దాడులు కంటే భార్య దాడులే ఎక్కువ అయిపోతున్నాయి. 

 

ఇంకా అసలు విషయానికి వస్తే.. సౌదీలో ఓ మహిళ తన రాక్షసత్వాన్ని బయట పెట్టింది. నిద్రపోతున్న భర్తపై యాసిడ్ పోసి రాక్షసానందాన్ని పొంది సంచలనం సృష్టించింది. ఈ మేరకు భర్త తెలిపిన వివరాల ప్రకారం.. అతను ఇంట్లో హాల్లో నిద్రపోతుండగా.. అతని భార్య ఈ దారుణమైన పని చేసినట్టు ఆవేదన వ్యక్తం చేశాడు. 

 

అతనిపై యాసిడ్ పోయడమే కాకుండా.. అతను ఇంట్లో నుంచి బయటకు రాకుండా భార్య అడ్డుకుందని బాధితుడు వాపోయాడు. అయితే అదృష్టవసాత్తు స్థానికుల సహాయంతో అతను ప్రాణాలతో బయటపడినట్టు వివరించాడు. కాగా అతని భార్య అతన్ని ఎందుకు చంపాలనుకుందో అతనికి కూడా తెలియదని తెలిపాడు. 

 

కాగా ఆమె చేసిన యాసిడ్ దాడి కారణంగా అతనికి కంటి చూపూ పోయింది.. ఇంతటి దారుణానికి పాల్పడిన రక్షేషిని.. భర్తపై హత్యాయత్నం చేసిన కారణంగా పోలీసులు అరెస్ట్ చేయగా.. ఆమె మరుసటి రోజే బెయిల్‌పై విడుదలైంది. ఇది ఆ రాక్షషి భార్య కథ. ఇలాంటివాళ్ళు కూడా ఉన్నారు. జాగ్రత్త...

మరింత సమాచారం తెలుసుకోండి: