ప్రస్తుతం ప్రపంచాన్ని ఏదైనా వణికిస్తోంది అంటే అది కరోనా వైరస్ ఏ.. చైనాలో వుహాన్ లో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. అత్యంత వేగంగా ఈ వైరస్ సోకుతుంది.. అందుకే ఈ వైరస్ పేరు వినగానే ప్రజలు అంత గజగజ వణుకుతున్నారు. ఇక చైనా దేశస్థులను చూసి మిగితా దేశ ప్రజలు అంత భయపడుతున్నారు. 

 

వాళ్ళు పక్కన ఉన్నారు అంటే వణికిపోతున్నారు.. ఇక ఇతర దేశాలకు వెళ్లి అక్కడ స్థిరపడ్డ చైనీయులకు కరోనా వైరస్ ఒక శాపంగా మారింది.. మీ కారణంగా మాకు వైరస్ సోకుతుంది.. మీరు తక్షణమే దేశాన్ని విడిచి వెళ్ళండి అంటూ వారిపై దాడికి దిగుతున్నారు. వారిపై వివక్ష చూపుతూ మానసిక వేదనకు గురి చేస్తున్నారు. 

 

అలానే తాజాగా ఇంగ్లాండ్ లో మొండి అనే చైనా మహిళను ఆ దేశం నుండి వారి సొంత దేశం అయినా చైనాకు వెళ్లిపోవాలని కొంతమంది దుండగులు ఆమెపై దాడికి దిగారు. అయితే అలా చెయ్యడం సరికాదు అని మొండి అనే మహిళను కాపాడబోయిన భారత మహిళ మీరాపై దుండగులు దాడికి పాల్పడ్డారు. అయితే భారత మహిళా మీరా ఈ దాడిలో స్పృహ కోల్పోయింది. 

 

దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.. ప్రస్తతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే మీరా.. మొండి మరికొందరు స్నేహితులు కలిసి పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో మీరాతో పాటు మరో మహిళకు కూడా గాయాలు అయ్యాయి. దీంతో కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: