ఒకప్పుడు భర్త మోసం చేస్తే.. అలా చెయ్యకూడదు అండి అని చెప్పేది.. ఆతర్వాత భార్య ఎవరినైనా మోసం చేస్తే పాపమే అని చెప్పేది.. కానీ ఇప్పుడు ప్రతి ఒకరిని ఒకరు తిట్టుకోకుండా.. భార్యాభర్తలిద్దరూ కలిసి మోసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ఎన్నారై దంపుతులు ఓ వ్యక్తిని దారుణంగా మోసం చేశారు.. దీంతో వారిపై చీటింగ్ కేసు నమోదైంది. 

 

ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ రాష్ట్రం జలంధర్ జిల్లా నకోదర్‌లోని ధలివాల్ గ్రామానికి చెందిన ఎన్నారై దంపతులు మొహిందర్ సింగ్, సురీందర్ కౌర్‌ అదే గ్రామానికి చెందిన కెనడియన్ పౌరసత్వం కలిగిన దల్జీత్ బస్రా అనే వ్యక్తిని మోసం చేశారు. బస్రా అనే  భూమిని మరో వ్యక్తి పేరు మీద రిజిస్టర్ చేశారు. 

 

దీంతో బస్రా.. ఆ జిల్లా ఎస్ఎస్‌పీకి ఫిర్యాదు చేశాడు.. ఆ ఎన్నారై దంపతులు తనకు అమ్మిన రూ. 3 కోట్ల విలువ గల భూమిని గట్టి రాయ్‌పూర్ గ్రామానికి చెందిన జస్పాల్ సింగ్ అనే వ్యక్తి పేరుపై రిజిస్టర్చేశారు అని బస్రా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అతని ఫిర్యాదు మేరకు ఎన్నారై దంపతులపై చీటింగ్ కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. పాపంలో కూడా కలిసే ఉంది ఈ జంట. 

మరింత సమాచారం తెలుసుకోండి: