పాపం... ఇలాంటి ఘటన ఏ దంపతులకు రాకూడదు. అలాంటి దారుణమైన ఘటన ఈ దంపతులకు జరిగింది. అసలు ఎం జరిగింది అంటే? ఆరు నెలలు క్రిత్రం ఆ దంపతులు ఒకటయ్యారు. భార్య ప్రస్తుతం మూడు నెలల గర్భిణీ. సరదాగా.. సాఫీగా మస్కట్ టూర్‌కు వెళ్లారు. ఎంతో ఆనందంగా వెళ్లిన ఆ దంపతులు విధి ఆడిన వింత నాటకంలో బలయ్యారు. ఒకరు మరణించి బలవుతే ఒకరు బతికి బలయ్యారు. 

 

ఎలా అనుకుంటున్నారా? అదేనండి.. ఎంతో సంతోషంగా ఆనందంగా మస్కట్ టూర్ కు వెళ్లిన వారు వివిధ ప్రదేశాలను సందర్శించి మస్కట్ లో కొన్ని రోజులు ఆనందంగా గడిపారు. సరదాగా ఫుట్‌బాల్ ఆడుతున్న సమయంలో అతను గుండెపోటుకు గురై మైదానంలోనే కుప్పకూలాడు. దాంతో స్నేహితులు వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 

 

కానీ అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. దీంతో ఈ విషయాన్నీ అతని కుటుంబసభ్యులకు తెలియచేశారు. కానీ మూడు నెలల గర్భిణీ అయినా అతని భార్యకు తెలియచెయ్యలేదు. తెలిస్తే ఆమె పరిస్థితి ఎం అవుతుందో అని భావించి ఆమెకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. 

 

నీ భర్తకు కరోనా లక్షణాలు ఉన్నాయని ఐసోలేషన్ వార్డులో ఉంచినట్లు తెలిపారు. అతన్ని చూడటానికి ఎవరిని అనుమతించడం లేదని.. నీవు వెంటనే స్వదేశానికి వెళ్లిపోవాలని చెప్పారు. వెంటనే ఆమెకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ బుక్ చేశారు. అదే విమానంలో ఆమె భర్త శవపేటికను కూడా స్వదేశానికి పంపించారు. 

 

భార్య తనకు తెలియకుండానే భర్త శవపేటికతో ఒకే విమానంలో ప్రయాణించి స్వస్థలానికి చేరుకుంది. చివరకు సొంత ఊరికి వచ్చిన తరువాత ఆమెకు ఈ విషయం తెలిసింది. దీంతో ఒక్కసారిగా ఆమె కుప్పకూలిపోయింది. గుండెలు విలిసిలే రోదించింది. కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: