అమెరికాలో నానాటికి జాత్యహంకార దాడులు జరుగుతూనే ఉన్నాయి . ఓపక్క కరోనా వచ్చి దేశాలు కొట్టు మిట్టాడుతుంటే కొంతమంది మదించి ఇతరులపై దాడులకు దిగుతున్నారు. అమెరికాలో నెల్లూరుకు చెందిన యువకుడిపై కాల్పులు జరపడంతో అతడి పరిస్థితి విషమం గా ఉంది .ఈ ఘటన ఏప్రిల్‌ 9న చోటుచేసుకుంది. కా. నెల్లూరు లోని మనుబోలు మండలం మడమనూరుకు చెందిన డేగా ధీరజ్‌ రెడ్డి ఇటీవల పై చదువుల కోసం అమెరికా వెళ్లాడు.

 

చికాగోలోని సెయింట్‌ లూయీస్‌కు  ఓ పని నిమిత్తం వెళ్లి అక్కడ సెల్లార్‌లో కారును పార్కింగ్‌ చేస్తుండగా నల్ల జాతీయులు అతడిపై తుపాకులతో కాల్పులు జరిపారు.ధీరజ్ అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు.తీవ్ర రక్త చరిత్రలో ఉన్న ధీరజ్ ను పొరుగు వారు ఆస్పత్రికి చేర్చారు. బులెట్ ధీరజ్ ఒంట్లో ప్రవేశించిన బుల్లెట్ కుడి వైపున పేగు, కాలేయాన్ని దెబ్బతీసింది. ప్రస్తుతానికి ధీరజ్ icu చికిత్స పొందుతున్నాడు. వైద్యులు ప్రస్తుతానికి ధీరజ్ ఆరోగ్యం విషమంగా ఉన్న త్వరలో కోలుకుంటాడు అని స్నేహితులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: