మొన్నటి రోజున భారత్ లో జరిగిన ఉగ్రవాద దాడిలో అసువులు బాసిన దాదాపు 49 మంది వీర జవాన్ల ఆత్మలు శాంతించాలని, వారి కుటుంభాలు త్వరగా కోల్కొవాలని భారత్ లో ఉన్న ప్రతీ ఒక్క భారతీయులు కోరుకున్నారు...కాశ్మీర్లో పుల్వామా జిల్లాలో జరిగిన ఈ ఘటన ప్రతీ భారతీయుడిని కలిచి వేసింది.
ప్రపంచ దేశాలు అన్నీ ముక్తఖంటంతో ఖండించాయి..అయితే అగ్ర రాజ్యం అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులు ఎంతో మంది ఆ వీర జవాన్ల శ్రద్ధాంజలి ఘటించారు. అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ ఆధ్వర్యంలో స్వాగత్ రెస్టారెంట్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఎన్నారైలు అందరూ పాల్గొని.అమరులు అయిన జవాన్ల కి అంజలి ఘటించారు.
దేశంకోసం జవాన్లు చేస్తున్న త్యాగాలు ఎన్నటికి , పతీ భారతీయుడు మరువ లేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో, భాస్కర్ , ప్రసాద్ మంగిన ,జీవన్, తిరుపతయ్య గండె,రామన్ చెల్లదురై, రజనీకాంత్ కాకర్ల, రమేష్ కొండ,హరి గక్కాని,సాజన్, సుగుణారెడ్డి, రామ్తోట తదితరులు పాల్గొన్నారు.