ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) చాప్టర్ ప్రారంభోత్సవం సందర్భంగా కనెక్టికట్‌లోని నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌కు అనూహ్య స్పందన లభించింది. ఈ పోటీల్లో మొత్తం 15 జట్లు పాల్గొన్నాయి. మాంచెస్టర్ హైస్కూలు, విండ్ సర్ లాక్స్ హైస్కూల్, విండ్ సర్ లాక్స్ మిడిల్ స్కూలు, విక్ హమ్ పార్క్ లు వేదికగా రెండురోజులపాటు జరిగిన పోటీల్లో 21 మ్యాచ్‌లు జరిగాయి. పోటీలను వీక్షించేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు.



 విజేతలకు నాట్స్ అధ్యక్షుడు మోహనకృష్ణ మన్నవ, నాట్స్ మీడియా కో ఆర్డినేటర్ మురళీకృష్ణ మేడిచెర్ల, నాట్స్ నార్త్ ఈస్ట్ జోన్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి, న్యూజెర్సీ కో ఆర్డినేటర్ వంశీకృష్ణ వెనిగళ్ల, నాట్స్ మెంబర్ షిప్ జాతీయ సమన్వయ కర్త తరణి పరుచూరి, నాట్స్ కనెక్టికట్ చాప్టర్ కో ఆర్డినేటర్ ప్రదీప్ గడ్డం బహుమతులు అందించారు. నాట్స్ కనెక్టికట్ ప్రాంతంలో తొలిసారిగా చేపట్టిన ఈ క్రికెట్ టోర్నమెంట్ ను దిగ్విజయంగా నిర్వహించినందుకు స్థానిక నాట్స్ టీం కు జాతీయ నాయకత్వం ప్రత్యేక అభినందనలు తెలిపింది. కనెక్టికట్ లో చేపట్టే ఏ కార్యక్రమానికైనా తమ వంతు సంపూర్ణ మద్దతు, సహకారం అందిస్తామని ఈ సందర్భంగా నాట్స్ జాతీయ నాయకత్వం తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: