సినీ, రాజకీయ ప్రముఖుల ప్రసంగాలు..సందేశాత్మక నాటికల్లో చిన్నారుల అభినయాలు...సినీ హాస్యనటులు పూయించిన నవ్వుల పువ్వులు...వెరసి ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్‌) ఆధ్వర్యంలో షికాగోలోని శ్యాంబర్గ్‌లో నిర్వహిస్తోన్న తెలుగు సంబరాలు రెండో రోజు ఘనంగా కొనసాగాయి. ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్‌, దర్శకుడు హరీష్‌ శంకర్‌, నిర్మాత దిల్‌రాజు, కథానాయకి పూజాహెగ్డే, తెతెదేపా కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తదితరులు అతిథులుగా హాజరయ్యారు. అల్లు అర్జున్‌ మాట్లాడుతూ అమెరికాలోని తెలుగువారంతా ఒకేచోటకు చేరి సంబరాలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ అమెరికా రాజకీయాల్లోనూ తెలుగువారు రాణించాలని పిలుపునిచ్చారు. నాట్స్‌ అధ్యక్షుడు మన్నవ మోహనకృష్ణ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో నాట్స్‌ కొనసాగిస్తోన్న సేవా కార్యక్రమాల గురించి వివరించారు. రైతు నేస్తం ఫౌండేషన్‌ ఛైర్మన్‌ వై.వెంకటేశ్వరరావు ప్రసంగిస్తూ తెలుగునాట వ్యవసాయం చేస్తున్న అన్నదాతలకు అండగా నిలవాలని ప్రవాసాంధ్రులను కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: