కొత్త రాష్ట్రంలో అన్ని రంగాల్లో ప్రవాసాంధ్రుల భాగస్వామ్యం ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశిస్తున్నట్టు గుంటూరు మిర్చి యార్డు ఛైర్మన్ మన్నవ సుబ్బారావు తెలిపారు. అమెరికాలోని అట్లాంటాలో ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ శాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ తెదేపా నాయకులు కిషన్రెడ్డి, గుంటూరు మిర్చి యార్డు ఛైర్మన్ మన్నవ సుబ్బారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అట్లాంటా ఎన్ఆర్ఐ తెదేపా నాయకులు మల్లిక్ మేదరమెట్ల, శ్రీనివాస్ లావులు రూపొందించిన ‘రాజధాని నిర్మాణం-ప్రవాసాంధ్రుల భాగస్వామ్యం’ సీడీని ఆవిష్కరించారు. అనంతరం ఉచిత మెడికల్ క్యాంపును ప్రారంభించారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి స్వర్గీయ నందరమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.