అమెరికా పాఠ్యాంశాల్లో హిందువుల మనోభావాలకి అనుగుణంగా హిందుత్వం
గురించి..ఖచ్చితమైన శాస్త్రీయ పద్దతుల్లో ఇవ్వాలని హిందూ వర్గాలు చేస్తున్న పదేళ్ళ
సుదీర్ఘ పోరాటానికి న్యాయం లభించింది. ఈ కేసుకి సంభందించి హిందూ బృందాలు కాలిఫోర్నియా కేసులో కీలక
విజయాన్ని సాధించాయి....హిందుత్వం, భారతదేశం గురించి
అమెరికా పాఠ్యాంశాల్లో ఖచ్చితమైన సమాచారాన్ని అందించేందుకు కాలిఫోర్నియా
ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, స్టేట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎస్బీఈ)
అంగీకారం తెలిపింది.
గతంలో రెండు పాఠ్యాంశాల శైలిని సైతం కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ తిరస్కరించింది. అంటే గ్రేడ్స్ కే6-గ్రేడ్స్ 6-8 వరకూ అన్ని పాఠ్యాంశాల్లోనూ హిందువులు, భారత దేశ చరిత్రను సమగ్రంగా అందించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆదేశాలు జారీ చేసింది. కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకున్న ఈ హిందువుల మనోభావాలని గౌరవించేలా ఉందని తెలిపారు
కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమైనదని అమెరికా హిందూ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అధ్యక్షుడు శాంతారామ్ అన్నారు. అయితే కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకున్న ఈ నిర్ణయంకేవలం ఆ రాష్ట్రానికి మాత్రమేనట