భారత్ నుంచీ అనేకమంది విద్యార్ధులు ఉన్నత చదువులకోసం ఇంక దేశాలు వెళ్లి చదువుకుంటున్నారు..ముఖ్యంగా ఈ సమాఖ్య ఎక్కువగా యూకే లో ఉంది అయితే ఇప్పుడు యూకే లో చదువుకుంటున్న విద్యార్ధులకి గుడ్ న్యూస్ తెలిపింది...స్టూడెంట్ వీసా నుంచి వర్క్ వీసాలోకి మారడానికి యూకే నిబంధనలను మరింత సరళతరం చేసింది. ఈ ఈ కొత్త ఇమ్మిగ్రేషన్ నిబంధనలు జనవరి 11 నుంచి ప్రవేశపెట్టనున్నట్టు తెలిపింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం యూకేలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు తమ కోర్సును పూర్తిచేసుకునే లోపలే టైర్-2 వీసా(స్కిల్డ్ వర్క్ వీసా)లోకి మారిపోవచ్చు అంటూ తెలిపింది..
అయితే ఇప్పటివరకూ ఉన్న నిబంధనల్లో టైర్-2 వీసాను విద్యార్థులు పొందాలంటే..ఖచ్చితంగా సదరు విద్యార్ధి డిగ్రీని పూర్తి చేయాల్సి ఉంటుంది. డిగ్రీ పట్టా పొందే దాకా ఆగాల్సి వస్తుండటంతో, అనంతరం విద్యార్థులు ఉద్యోగం వెతుకోవడానికి కొద్ది సమయం మాత్రమే ఉంటుంది. దీంతో విద్యార్థులు ఉద్యోగం పొందడంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దాంతో విద్యార్ధులు పడే ఇబ్బందుల దృష్ట్యా ప్రస్తుతం సవరించిన నిబంధనల వల్ల కొన్ని నెలలు ముందుగానే విద్యార్థులు టైర్-2 వీసాను దరఖాస్తు చేసుకోవచ్చని ఈవై-యూకే పేర్కొంది.
చదువుకోవడానికి వెళ్తున్న విద్యార్ధులకు స్టూడెంట్ వీసా ని కోర్సుల కాల వ్యవధితో పాటు..4 నెలల కాలానికి కలిపి ఇస్తున్నారు. కేవలం నాలుగు నెలల సమయం మాత్రమే ఉండటం విదేశీ విద్యార్థులు ఉద్యోగం వెతుకోవడాన్ని దెబ్బతీస్తోంది. ఈసమయంలో వారు కనుకా ఉద్యోగాన్న పొందక పొతే తిరిగి తమ తమ దేశాలకి వేలిపోవాల్సిందే దానితో విద్యార్ధుల సమయం వృధా అవుతోంది..అంతేకాక టైర్-4 వీసా నుంచి టైర్-2వీసాల్లోకి మారడం కూడా చాలా క్లిష్టతరంగా ఉంటుంది...సో ఇప్పుడు యూకే ఇచ్చిన వెసులుబాటుతో విద్యార్ధులు ఎంతో ధైర్యంగా తమ చదువులని ప్రసాంతంగా కొనసాగించవచ్చును అంటున్నారు అధికారులు.