భారతదేశం
నుంచీ వివిధ దేశాలకి వెళ్లి స్థిరపడాలని
కలలు కన్న ఎంతో మంది భారతీయులు..అమెరికా వంటి అగ్రరాజ్యంలో..పలు కంపెనీలలో
మరియు ప్రభుత్వ రంగ సంస్థలలో..చివరికి అక్కడి ప్రభుత్వంలో కూడా కీలకంగా ఉంటూ వచ్చారు...ఈ
క్రమంలోనే భారతీయులు ఎంతో తెలివైన వాళ్ళు ఎంతో ప్రతిభావంతులు అని అన్ని దేశాలు
గుర్తించి సముచిత స్థానాన్ని కలిపించాయి. అయితే భారత్ నుంచే అమెరికా వెళ్లి అక్కడ
ఒక కంపెనీ స్థాపించిన ఎన్నారై చేసిన పని వల్ల..భారత్ పరువు పోయింది. వివరాలలోకి
వెళ్తే.
భారత్ కి చెందిన రాజు కొసురి అనే 45 ఏళ్ల వ్యక్తి అమెరికా వెళ్లి అక్కడ వర్జీనియా కేంద్రంగా ఒక షెల్ కంపెనీ స్థాపించాడు..అయితే ఈ కంపెనీ ఆధారంగా చేసుకుని అనేక నేరాలకి పాల్పడ్డాడు రాజు..అదేమిటంటే హెచ్-1బీ వీసా అనేది అమెరికా ఎంతో ప్రతిష్టాత్మకంగా..చేసే ప్రక్రియ ఈ వీసా విషయంలో అవకతవకలకు పాల్పడ్డాడు ఉద్యోగం పేరుతో వేలాది మంది విదేశీయులకు హెచ్ 1 –బి వీసా ని మంజూరు చేశారు..ఈ క్రమంలో దాదాపు 20 మిలియన్ డాలర్ల మోసం జరిగింది అని అధికారులు చెప్పారు.
అయితే ఈ తతంగం అంతా కూడా 1999-2016 మధ్య కాలంలో ఈ మోసం జరిగిందని విచారణలో వెల్లడైంది. దీంతో నిందితుడికి 28 నెలల జైలుశిక్ష విధించిన వర్జీనియా ఫెడరల్ కోర్ట్ తీర్పునిచ్చింది రాజు కొసురి వీసాలని అమ్ముకున్నదని అమెరికా న్యాయస్థానం స్పష్టం చేసింది..శిక్షా కాలం పూరి కాగానే నిందితుడి రాజుని అతడి భార్య ,అమెరికాలో పుట్టిన కొడుకుని వారి దేశం అయిన భారత్ కి పంపివేయాలని తీర్పు ఇచ్చారు న్యాయమూర్తి..