అమెరికా ఎప్పటికప్పుడు వలసదారులకి
కళ్ళెం వేస్తూనే వస్తోంది...ఇప్పుడు అమెరికాలో ఉన్న “బై
అమెరికన్, హైర్ అమెరికన్” పాలసీ కోసం ట్రంప్ కార్యాలయం తీసుకునే నిర్ణయాలతో
భారతీయులు భారీ మొత్తంగా వెనక్కి తిరిగిరావాల్సి వస్తోంది..హోం ల్యాండ్ సెక్యూరిటీ
ప్రతిపాదనలతో.. హెచ్-1బీ
వీసాలు కఠినతరం కావడం, గ్రీన్ కార్డు అప్లికేషన్లు పెండింగ్లో పడటం
వంటివి చోటుచేసుకుంటున్నాయి. దీంతో వేలకొద్దీ భారతీయ ఉద్యోగులు అమెరికా నుంచి
భారత్కు వచ్చేయాల్సిన పరిస్థితి వస్తుందని తెలుస్తోంది.
అయితే అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం వలన అధికశాతం ఉద్యోగులలో ఐటీ రంగం వారిపై తీవ్రమైన ప్రభావం ఉండబోతుంది అని తెలుస్తోంది..ఇప్పటికే అక్కడ ఉంటున్న ఎన్నారైల్లో ఎక్కువ శాతం భారతీయులే టార్గెట్ గా ఈ పరిణామాలు జరగడం అమెరికా వచ్చి స్థిరపడాలి అనుకున్న ఇండియన్స్ లో తీవ్రమైన కలవరం మొదలవుతోంది. ఇదిలా ఉంటే భారతీయ వర్కర్లకు హెచ్-1బీ వీసాల అప్లికేషన్లకు గడువు పొడిగింపు కష్టతరం కావడంతో పాటు..శాశ్వత సభ్యత్వం కోసం ఎన్నారైలు పొందే గ్రీన్కార్డుల దరఖాస్తులు పెండింగ్ లో పడుతున్నట్టు తెలిసింది.
ఇప్పటివరకున్న నిబంధనలతో గ్రీన్ కార్డు ఆమోదం పొందలేని పక్షంలో హెచ్-1బీ వీసాలకు మరో మూడేళ్ళ పొడిగింపును ట్రంప్ కార్యాలయం చేపడుతోందట..కానీ డీహెచ్ఎస్ ప్రతిపాదనలతో హెచ్-1బీ వీసాల పొడిగింపు కష్టతరంగా మారుతోంది..అయితే అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా సుమారు 50వేల నుంచి 75 వేల వరకు భారతీయ హెచ్-1బీ వీసా హోల్డర్స్ తిరిగి స్వదేశానికి రావాల్సి వస్తుందని తెలుస్తోంది..మరి భరత ఐటీ రంగం నుపుణులు అక్కడ ఈ పరిస్థితిని ఎదుర్కుంటే..సంభందిత కంపెనీలు ఎటువంటి వీరా సంభందిత సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతునే ఉన్నాయి..